దుల్కర్ సల్మాన్ హీరోగా, మృణాల్ థాకూర్ హీరోయిన్గా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ “సీతారామం”. ఆగస్ట్ 5న రిలీజ్ అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ వేడుకకు అతిధులుగా దర్శకులు తరుణ్ భాస్కర్, అనుదీప్, నాగ్ అశ్విన్లు హాజరు కాగా.. ముఖ్య అతిధిగా ఇంటర్నేషనల్ హీరో, యంగ్ రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ హాజరయ్యారు. డార్లింగ్ రాకతో ప్రాంగణం మొత్తం అభిమానుల కోలాహలంతో హోరెత్తిపోయింది. సీతారామం మూవీ డైరెక్టర్ హను రాఘవపూడి, ఈ సినిమాలో నటించిన తరుణ్ భాస్కర్, నాగ్ అశ్విన్, అనుదీప్లు సినిమాకి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఇక ఆఖరున మన డార్లింగ్ ప్రభాస్ మాట్లాడారు. డార్లింగ్ మాట్లాడడం ఒక ఎత్తు అయితే.. ఈ సినిమా టికెట్ను కొనడం మరొక ఎత్తు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది.
ఈ సినిమాకి సంబంధించిన మొదటి టికెట్ను ప్రభాస్ కొన్నారు. రూ. 100 రూపాయల సీతారామం మూవీ టికెట్ను నిర్మాత అశ్వినీదత్ చిత్ర యూనిట్తో కలిసి ప్రభాస్కు అందజేశారు. ఈ మూవీకి సంబంధించిన మొదటి టికెట్ ఇదే. అంటే ఈ సినిమాని అందరి కన్నా ముందే చూసేది ప్రభాస్ అన్న మాట. ఏది ఏమైనా డార్లింగ్ టికెట్ కొనడం ఏదైతే ఉందో అది నభూతో న భవిష్యతి. డార్లింగ్ ఈ సినిమా థియేటర్లో చూడాల్సిన సినిమా, తాను థియేటర్లో చూస్తున్నా, మీరు కూడా థియేటర్లోనే చూడండి’ అని తన ఫ్యాన్స్కు పిలుపునిచ్చారు. ఇక డార్లింగ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో, అశ్వినీదత్ నిర్మాణ సారధ్యంలో ‘ప్రాజెక్ట్ కె’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి రూ. 100 పెట్టి మొదటి టికెట్ కొన్న యంగ్ రెబల్ స్టార్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.