గతేడాది పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన తెలుగు సినిమాలలో అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' ఒకటి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాతో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కాస్త ఐకాన్ స్టార్ గా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే.. పుష్ప మేనియా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గరే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవ్వడంతో.. ఇప్పుడు సీక్వెల్ 'పుష్ప-2' పై అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. ఇక త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న పుష్ప 2 సినిమాకు సంబంధించి స్క్రిప్టు, ప్రీ ప్రొడక్షన్, కాస్ట్ ఇలా అన్ని విషయాలలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. సీక్వెల్ లో ఇప్పుడు ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ తో పాటు మరికొన్ని కొత్త క్యారెక్టర్లను ఇంట్రడ్యూస్ చేయనున్నట్లు తెలుస్తుంది. సుకుమార్ ఇదివరకే తన ఫేవరేట్ హీరోయిన్స్ లో సమంత ఒకరని చెబుతూ వచ్చాడు. అందుకే రంగస్థలంలో కూడా ఆమెను హీరోయిన్ గా తీసుకున్నానని, పుష్ప విషయానికి వచ్చేసరికి ఐటమ్ సాంగ్ వరకే పరిమితమైంది. పుష్పలో 'ఊ అంటావా మావా' పాటతో దేశవ్యాప్తంగా యూత్ ని ఓ ఊపు ఊపేసిన సమంత.. ఇప్పుడు మరోసారి పుష్ప సీక్వెల్ లో కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈసారి సీక్వెల్ లో మాత్రం సమంత సాంగ్ కోసం కాకుండా సుకుమార్ ఆమెకోసం కీలకమైన క్యారెక్టర్ రెడీ చేశాడని, సిండికేట్ ని శాసించే పుష్పరాజ్ కి సాయపడే పాత్రలో సమంత నటించబోతుందని బలమైన టాక్ నడుస్తుంది. మరి ఇందులో నిజమెంత అనేది మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మిక మందన నటించనుండగా, ఫహద్ ఫాజిల్ క్రూయల్ పోలీస్ ఆఫీసర్ భన్వర్ సింగ్ షెకావత్ రోల్ పోషిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. పుష్ప 2లో విజయ్ సేతుపతి ఓ క్యారెక్టర్ చేయనున్నాడనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు సమంత పేరు తెరమీదకు వచ్చింది. ఇక మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ సినిమాకు దేవి శ్రీప్రసాద్ సంగీత దర్శకుడు. మరి పుష్ప 2 మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. ఇదీ చదవండి: నాగార్జునతో ‘విక్రమ్’ లాంటి సినిమా తీస్తా: డైరెక్టర్ చందూ మొండేటి