గతేడాది, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఎంత రచ్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కి ఫుల్ పోటీ ఇచ్చిన విష్ణు ప్యానెల్.. చివరికి విజయం సాధించింది. ‘మా’ అధ్యక్షుడిగా విష్ణు బాధ్యతలు అందుకున్నారు. అంతా బానే ఉంది కానీ ఆ ఎన్నికల టైమ్ లో జరిగిన విషయం గురించి నటుడు బెనర్జీ ఇప్పుడు మరోసారి మాట్లాడారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ టీవీ ఛానెల్లో ప్రతివారం ప్రసారమయ్యే ‘ఓపెన్ హార్డ్ విత్ ఆర్కే’ ప్రోగ్రాంకి ఈసారి గెస్ట్ గా నటుడు బెనర్జీ వచ్చారు. తన గురించి ఎవ్వరికీ తెలియని ఎన్నో విషయాలు పంచుకున్నారు. తాను డైరెక్టర్ అవుదామని వచ్చానని, కానీ అమితాబ్ బచ్చన్ సినిమాకు పనిచేస్తున్న టైమ్ లో ఓ కన్నడ నటుడు రాకపోవడంతో.. తను ఆ సీన్స్ చేశానని, అలా నటుడిని అయిపోయానని బెనర్జీ అన్నారు.
మోహన్ బాబు మీపై చేయి చేసుకున్నారట కదా అని ఆర్కే అడగ్గా.. కళ్లు తుడుచుకుంటూ బెనర్జీ ఎమోషనల్ అయ్యారు. మోహన్ బాబు విజ్ఞతకే ఆ విషయాన్ని వదిలేశానని చెప్పారు. ఇక మా ఎన్నికల టైమ్ లో ఏం జరిగిందంటే… ‘ప్రకాశ్ రాజ్ ప్యానెల్ లోని తనీష్ ని మోహన్ బాబు తిట్టారు. ఆ టైమ్ లో అక్కడికి వెళ్లి, గొడవలొద్దని విష్ణుతో చెప్పాను. వెంటనే మోహన్ బాబు నన్ను కొట్టడానికి వచ్చారు. అరగంటపాటు బూతులు తిడుతూనే ఉన్నారు. 40 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న నన్ను అలా తిట్టేసరికి షాక్ లో ఉండిపోయాను’ అని అప్పట్లో మీడియా ముందు బెనర్జీ కన్నీటి పర్యంతమయ్యారు. మరి మోహన్ బాబుతో ఇష్యూ గురించి బెనర్జీ క్లారిటీ ఇవ్వడం గురించి.. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇది కూడా చదవండి: మోహన్ బాబు నన్ను బూతులు తిట్టాడు.. అందుకే బయటికొచ్చా: నటుడు బెనర్జీ