నిద్రపోతున్న సమయంలో ఒక వ్వక్తి వచ్చి తనను ఎత్తుకెళ్ళి స్మశానంలో బలవంతం చేసేవాడని ప్రముఖ హీరోయిన్ వెల్లడించింది.
పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తున్న హీరోయిన్.. తన జీవితంలో భయంకరమైన రోజులను ఎదుర్కొన్నట్లు వెల్లడించింది. నిద్రపోతున్న సమయంలో ఒక వ్యక్తి ఇంట్లోకి వచ్చి తనను శ్మశానవాటికకు తీసుకెళ్లి బలవంతం చేసేవాడని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ. రాక్ స్టార్ సినిమాతో బాలీవుడ్కి పరిచయం అయ్యింది. ఆ తర్వాత మద్రాస్ కేఫ్, ఫటా పోస్టర్ నికలా హీరో, కిక్, స్పై, హౌస్ఫుల్ 3 వంటి చిత్రాల్లో నటించింది. తను చేసిన మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు దక్కింది. అంతేకాదు ఆ సినిమాకి గాను ఉత్తమ నటి అవార్డు సొంతం చేసుకుంది. హౌస్ ఫుల్ – 3కి గాను ఉత్తమ హాస్యనటి అవార్డు కూడా వరించింది. వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తుంది ఈ బాలీవుడ్ బ్యూటీ.
అలాగే తెలుగులో పవన్ కళ్యాణ్తో చేస్తున్న ‘హరి హరి వీరమల్లు’ చిత్రంతో ఎంట్రీ ఇవ్వనుంది. ఓటీటీలో కూడా అరంగేట్రం చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నర్గీస్.. తన జీవితంలో ఎదురైన భయంకరమైన రోజులను గుర్తు చేసుకుంది. ముంబైలోని బాంద్రాలో హిల్ రోడ్ లో ఉండేదాన్నని.. తన అపార్ట్మెంట్కు దగ్గరలో ఒక శ్మశానవాటిక ఉందని వెల్లడించింది. అక్కడ ఉన్నప్పుడు చాలా భయంకరమైన పీడ కలలు వచ్చేవని.. భయంతో తెల్లవారుజామున 3 గంటలకే లేచేదాన్నని చెప్పుకొచ్చింది. కలలో ఓ వ్యక్తి దెయ్యంలా కనిపిస్తూ.. తనను స్మశానవాటికకు తీసుకెళ్లి.. అక్కడున్న ఎముకలు తీసి తినమని చెప్పేవాడని వెల్లడించింది. అలా వరుసగా నాలుగు రోజులు ఒకే ఒకే పీడకల వచ్చిందని తెలిపింది.
నాలుగు రోజలు అదే పీడకలలు రావడంతో చాలా భయం వేసిందని, ఏం చేయాలో నాకు అర్థం కాలేదని.. అక్కడ తెలిసివాళ్లు కూడా ఎవరు లేరని వెల్లడించింది. ఇక్కడ ఉంటే ఇంకెన్ని పీడ కలలు వస్తాయో అని వెంటనే ఫ్లాట్ ఖాళీ చేశానని.. అక్కడ నుంచి ఢిల్లీ వచ్చేసినట్లు గుర్తు చేసుకుంది. ప్రస్తుతం ఇక్కడ బాగుందని చెప్పింది. అయితే తన పాత ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఆరు చనిపోయిన పక్షి పిల్లలు కనిపించాయని ప్యాకర్స్ తనతో చెప్పారని.. దీంతో మరింత భయం వేసిందని.. అసలు అక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదంటూ భయంకరమైన రోజులను గుర్తుచేసుకుంది. నేను రావడానికి ముఖ్య కారణం అక్కడ పీడ కలలు రావడమే..అందుకే అక్కడి నుండి వచ్చానని తెలిపింది.