గత కొన్ని రోజులుగా సీనియర్ నటుడు నరేష్, పవిత్రా లోకేష్లకు సంబంధించి పలు వార్తలు ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే. నరేష్-పవిత్రా లోకేష్ సహాజీవనం, పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి తెరమీదకు వచ్చారు. నరేష్ పై సంచలన ఆరోపణలు చేశారు. వీటిపై నరేష్ ఘాటుగానే స్పందించాడు. అంతేకాక తన మూడో భార్య రమ్య మీద ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఆమెకు డ్రైవర్తో సంబంధం ఉందని అన్నాడు. ఆమె బెంగళూరులో కూడా మోసాలు చేయడానికి వచ్చిందని.. అక్కడి ప్రజలను అలర్ట్ చేయడానికే తాను కర్ణాటక వెళ్లానని నరేష్ తెలిపాడు.
ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్లో రమ్య చేసిన అప్పులను నేను స్వయంగా కట్టాను. కృష్ణ గారి వద్దకు వచ్చి చాలా మంది గొడవ చేశారు. ఆమె జైలుకు వెళ్తానని అంటే.. 10 లక్షలు స్వయంగా ఇచ్చాను. ఇప్పుడు నాపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నది. నేను మగాడ్ని. నాకు కొన్ని అవసరాలు ఉంటాయి. ఎమోషనల్ సపోర్ట్ కావాల్సిన సమయంలో నాకు పవిత్ర లోకేష్ పరిచయం అయింది. నా కష్టాలను అర్ధం చేసుకొన్నది. నాతోపాటు ట్రావెల్ అయింది. నా ఫ్యామిలీతో కలిసి ఉంటున్నది. నా జీవితంలో నీవు ఎక్కడ ఉన్నావు’’ అని ప్రశ్నించాడు.
ఇది కూడా చదవండి: Anushka Shetty: విజయ్ దేవరకొండ బోల్డ్ లుక్.. అనుష్క శెట్టి నాటీ కామెంట్స్ వైరల్!
‘‘నా ఫ్యామిలీ ఫంక్షన్లకు దూరంగా ఉన్నావు. నీవు ఎక్కడో.. ఎవరితోనో ఉంటున్నావు. ఆ విషయాల గురించి నేను మాట్లాడను. నీవు నీకు సంబంధించిన రిలేషన్స్తో, పర్సనల్, ప్రొఫెషనల్ వ్యాపకాలతో బిజీగా ఉన్నావు. వాటి గురించి చెడుగా మాట్లాడను. పవిత్రా లోకేష్ మూడు నాలుగేళ్ల క్రితం నా జీవితంలోకి వచ్చింది. కానీ నీవు 8 ఏళ్ల క్రితం వెళ్లిపోయావు. అయినా నా ప్రతిష్టకు భంగం కలిగించేలా.. నాపై చెడుగా ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నది. ఆమె కుటుంబ సభ్యులే డబ్బు ఇవ్వవద్దని హెచ్చరించారు’’ అని చెప్పుకొచ్చాడు నరేష్.
‘‘రమ్య మానసిక పరిస్థితి బాగా లేదు. ఆమెను మంచి సైక్రియాటిస్టుకు చూపించమని చెప్పారు. ఆమె మాట్లాడుతున్న చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. నన్ను బ్లాక్మెయిల్ చేసి నా నుంచి డబ్బు గుంజాలని చూస్తున్నారు. నాకు టార్చర్ పెడుతున్నారు. ఆమె మానసిక వ్యాధితో బాధపడుతున్నది. డబ్బు సంపాదించాలి. మోసం చేయాలనే ప్రయత్నిస్తున్నది. జర్నలిజం చదువుకొని ఏదో కంపెనీలు పెట్టింది. ఎమ్మెల్యే కావాలనే కోరికతో డబ్బు సంపాదించే పనిలో ఉంది. ఆమె వల్ల, ఆమె ఫ్యామిలీ వల్ల నా ప్రాణాలకు ముప్పు ఉంది. అందుకే నేను డైవోర్స్ కోసం అప్లై చేశాను. పవిత్ర లోకేష్ కోసం నేను రమ్యకు డైవోర్స్ ఇవ్వడం లేదు’’ అన్నాడు.
ఇది కూడా చదవండి: Actor Ketaki Chitale: నన్ను పోలీసులు లైంగికంగా వేధించారు: ప్రముఖ నటి
‘‘రమ్య చేసిన అప్పుల వల్ల నేను భయపడిపోయాను. ఆమెతో సంబంధం లేదని లీగల్ నోటీసులు ఇచ్చాను. నా పాస్పోర్ట్ నుంచి ఆమె పేరును తొలగించాను. ఇప్పుడు పవిత్రా లోకేష్ను పెళ్లి చేసుకొంటానా? లేక సహజీవనం చేస్తానా అనేది భవిష్యత్లో తెలుస్తుంది.ఏది జరిగినా నేను అధికారికంగా మీడియాకు వెళ్లడిస్తాను’’ అని నరేష్ తెలిపాడు. ఆయన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Bullet Bhaskar: సూసైడ్ చేసుకోబోయిన బుల్లెట్ భాస్కర్!