నటసింహం నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు చాలు మాస్ ఆడియెన్స్ కి పూనకాలు తెప్పించడానికి! థియేటర్లలో గోల చేయాలంటే బాలయ్య సినిమానే రావాల్సిన అవసరం లేదు. ఏ హీరో ఫ్యాన్స్ కి అయినా ‘జై బాలయ్య’ అనేది ఓ ఎమోషన్. ఇక బాలయ్య జనరేషన్ లోని చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ తదితరులు ఇప్పటికీ హీరోలుగా ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. వాళ్ల వారసులు కూడా హీరోలుగా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఒక్క బాలయ్య విషయంలో మాత్రం ఇది జరగలేదు. ఎందుకంటే బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడా అని ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అతడి ఎంట్రీ గురించి అదిరిపోయే విషయం బయటకొచ్చింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రాలజర్ వేణుస్వామి అంటే తెలియని వారుండరు. ప్రముఖల జీవితం, భవిష్యత్తు గురించి చెప్పే ఈయన.. ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటారు. ఇప్పుడు కూడా బాలయ్య వారసుడు మోక్షజ్ఞ గురించి చెప్పి హాట్ టాపిక్ అయ్యారు. ఎన్టీఆర్ వారసుడిగా బాలయ్య, హరికృష్ణ తదితరులు నటులుగా ఇండస్ట్రీలోకి వచ్చారు. అందులో బాలయ్య మాత్రమే హీరోగా నిలుదొక్కుకున్నారు. 100కి పైగా సినిమాల్లో హీరోగా నటించారు. ఇప్పటికే ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నారు. ఇక నందమూరి మూడోతరంలో ఎన్టీఆర్ మాత్రమే స్టార్ హీరోగా మారాడు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ కూడా అయిపోయాడు.
ఇక బాలయ్య వారసుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వడం గురించి ఎప్పటినుంచో తెగ మాట్లాడుకుంటున్నారు. బోయపాటి శ్రీను, క్రిష్ లాంటి డైరెక్టర్స్ పేర్లు వినపడ్డాయి. మొన్నటికి మొన్న ‘బింబిసార’ దర్శకుడు వశిష్ట్ తోనే మోక్షజ్ఞ ఎంట్రీ అని కన్ఫర్మ్ కూడా చేశారు. ఇప్పుడు వేణుస్వామి మాత్రం.. మోక్షజ్ఞ హీరో కావడానికి మరో రెండు మూడేళ్లు పడుతుందని చెప్పారు. అతడి జాతకం అద్భుతంగా ఉందని, కచ్చితంగా స్టార్ హీరో అవుతాడని కూడా కుండబద్దలు కొట్టేశారు. అతడు సినిమాల్లో తప్పించి, రాజకీయాల్లోకి వెళ్లడని క్లారిటీ ఇచ్చారు. మరి మోక్షజ్ఞ ఎంట్రీపై వేణుస్వామి చెప్పిన దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.