తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి వారసుల గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెండితెరను ఏలిన నటసార్వభౌమ నందమూరి తారకరామారావు ఈ వంశాన్ని చిత్ర సీమకు పరిచయం చేశాడు. ఈ కుటుంబం నుంచి ఎంతో మంది నటులు అరంగేట్రం చేసి సినీ పరిశ్రమలో తమ సత్తాను చూపుతున్నారు. ఇందులో నందమూరి బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారక రత్న వంటి ఎందరో నటులు సినిమాల్లో కొనసాగుతున్నారు. ఇక తాజాగా మరో వారసుడు రాబోతున్నాడంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.
నందమూరి బాలయ్య తనయుడు మోక్షజ్ఞ త్వరలో సినిమల్లోకి రాబోతున్నట్లు బాలయ్య కొంత మేరకు క్లారిటీ ఇచ్చారు. ఇక ఎప్పటి నుంచో మోక్షజ్ఞ ఎంట్రీపై వార్తలు వస్తూనే ఉన్నాయి. బాలయ్య సూపర్ డూపర్ హిట్ మూవీ ఆదిత్య 369.అప్పట్లో ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది. దీంతో దీనికి సీక్వెల్ చేయాలని బాలయ్య ఎప్పటి నుంచో కలలు కంటున్నాడు. ఈ సినిమా సీక్వెల్ ద్వారానే తన తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతుందని మరో సారి క్లారిటీ ఇచ్చారు బాలకృష్ణ. దీని గురుంచి ఎన్నో సార్లు మీడియాకు చెప్పారు.
ఇక తాజాగా మరోసారి కూడా సీక్వెల్ గురుంచి స్పష్టతనిచ్చారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ ఈ చిత్రంలో మోక్షజ్ఞ నటించబోతున్నారని చెప్పారు. ఈ మూవీని 2023లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని అన్నారు. దీనికి ఆదిత్య 999 మ్యాక్స్ అనే టైటిల్ పరిశీలిస్తున్నామని ప్రకటించారు. ఇక ఇప్పటికే మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచుస్తున్నారు నందమూరి అభిమానులు. ఇక తాజాగా బాలయ్య ఈ సినిమా గురుంచి కాస్త చెప్పటంతో తెగ ఆనందంలో ఉన్నారు ఆయన ఫాన్స్. మరి ఇంతకు ఈ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి మరి.