తెలుగు బుల్లితెరపై బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్ విత్ NBK. ఆహాలో దుమ్ములేపుతున్న ఈ షోకు మొదటి గెస్ట్ గా వచ్చారు మంచు మోహన్ బాబు. అయితే ఈ షోలో బాలకృష్ణ మోహన్ బాబు మధ్య కొన్ని ఆసక్తికర ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. మొదటి గెస్ట్ గా మోహన్ బాబు రావటంతో బాలయ్య తనదైన శైలీలో వ్యవహరించి ప్రశ్నలతో మోహన్ బాబు నుంచి కొన్ని అంతుచిక్కని సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశాడు.
అయితే ఈ క్రమంలోనే మోహన్ బాబు సైతం బాలకృష్ణకు ఊహించని ప్రశ్నలు వేసి చెమటలు పట్టించాడు. స్వర్గీయ నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగు దేశం పార్టీ పగ్గాలు ఎందుకు అందుకోలేదని మోహన్ బాబు అడగగా.. బాలకృష్ణ దీనికి పూర్తి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అప్పట్లో ఇందిర గాంధీ, రాహుల్ వారసత్వ రాజకీయాలు చేస్తున్నారని, నాన్న గారు మేము అలాంటి రాజకీయాలకు పూర్తిగా వ్యతిరేకించామని తెలిపారు.
అలా వ్యతిరేకించిన మేమే మళ్లీ టీడీపీ పగ్గాలు పట్టుకోవటం వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించినట్లు అవుతుందని దీని కారణంగా టీడీపీ పగ్గాలు వదులుకున్నామని బాలకృష్ణ తెలిపారు. ఇక దీంతో పాటు నారా చంద్రబాబు నాయుడు గ్రామ స్థాయి నుంచి ఎదిగిన మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న నాయకుడని అందుకే ఆయనకు పగ్గాలు అప్పగించామని బాలకృష్ణ వివరణ ఇచ్చారు.