ఒక చిత్రానికి స్క్రీన్ ప్లే… దర్శకత్వం, నటీ నటుల పర్ఫామెన్స్ ఎంత ముఖ్యమో అంతకన్నా ఎక్కువ ప్రాణం పోసేది సంగీతం. మ్యూజికల్ హిట్ సాధించిందీ అంటే పది కాలల పాటు ఆ చిత్రం గురించి చెప్పుకుంటారు. అలాంటి చిత్రాలు తెలుగు తెరపై ఎన్నో వచ్చాయి. ఎంతో మంది సంగీత దర్శకులు తెలుగు తెరపై చెరగని ముద్ర వేశారు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఎస్ ఎస్ థమన్ ఒకరు. సంగీత దర్శకుడు తమన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్గా తమన్ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. హీరోలు, డైరెక్టర్లు కూడా తమన్తోనే పని చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇంతగా ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ మ్యూజిక్ సన్సెషన్ ఈ స్థాయికి ఊరికే రాలేదని, దాని వెనక ఎంతో కష్టం ఉందని చెప్పాడు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న తమన్ .. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చాడు. మా నాన్న డ్రమ్స్ చాలా బాగా వాయించేవాడు .. ఆయన చాలా సినిమాలకి పనిచేశారు. అందువలన సహజంగానే నాకు డ్రమ్స్ వాయించడం పట్ల ఆసక్తి పెరుగుతూ పోయింది. ఒకసారి మేమంతా ఢిల్లీలోని మా అత్తయ్య ఇంటికి వెళ్లి ట్రైన్ లో వస్తుండగా, మా నాన్నకి హార్ట్ ఎటాక్ వచ్చింది. ట్రీట్మెంట్ ఆలస్యం కావడంతో ఆయన చనిపోయారు.
ఇది చదవండి : హైదరాబాద్ లో వింత వ్యాధి.. చిన్నారులపైనే ఎఫెక్ట్
నాన్న చనిపోవడంతో ఆయన ఎల్ఐసి పాలసీకి సంబంధించి 60 వేల రూపాయలు వచ్చాయి. ఆ డబ్బును ఇంట్లో వాడకుండా మా అమ్మ నాకు డ్రమ్స్ కొనిపెట్టింది. అమ్మ ఇచ్చిన ఆ ప్రోత్సాహాన్ని నేను ఇప్పటికీ మర్చిపోలేనని.. ఆ డ్రమ్స్తో నేను సాధన చేస్తూ డ్రమ్మర్గా ముందుకు వెళ్లాను. ఈ క్రమంలో నేను డ్రమ్మర్గా పనిచేసిన తొలి చిత్రం ‘భైరవద్వీపం’. ఆ సినిమాకి పని చేసినందుకు నాకు 30 రూపాయలు పారితోషికంగా ఇచ్చారు. అలా డ్రమ్మర్గా నా తొలి సంపాదనగా 30 రూపాయలు సంపాదించాను’ అని చెప్పుకొచ్చాడు.
ఈ మద్య బాలయ్య నటించిన ‘అఖండ’ సినిమాకు తమన్ అందించిన మ్యూజిక్ ఎంత సన్సెషన్ అయ్యిందో తెలిసిందే. ప్రస్తుతం తమన్ ‘భీమ్లా నాయక్’ మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’, వరుణ్ తేజ్ ‘గని’, అఖిల్ ‘ఏజెంట్’తో పాటు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న సినిమాకు కూడా తమన్ స్వరాలు అందిస్తున్నాడు.