ఈ ఏడాది సినీ పరిశ్రమకు అస్సలు కలిసి రావడం లేదు. సినీ ప్రముఖులు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్స్తో పాటు పాటల రచయతలు కన్నుమూశారు. కొంత మంది అనారోగ్యంతో కన్నుమూస్తే.. బలవన్మరణంతో కొంతమంది.. మరికొంత మంది హఠాన్మరణం చెందారు. తాజాగా తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సంగీత దర్శకుడు ప్రమోద్ కుమార్ పరిసర్ల గుండెపోటు కారణంగా కన్నుమూశారు.
తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలకు సౌండ్ మిక్సింగ్ ఇంజనీర్ పని చేసి.. ఇటీవల సంగీత దర్శకుడిగా మారిన ప్రమోద్ కుమార్ పరిసర్ల గుండెపోటుతో కన్నుమూశారు. విశాఖపట్నంకి చెందిన ప్రమోద్ కుమార్ కొంత కాలం క్రితం ఇండస్ట్రీలో సౌండ్ ఇంజనీర్ గా పరిచయమైయ్యాడు . పలు యాడ్స్, ప్రైవేట్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్, సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.
ఆదిత్య ఓం హీరోగా, రేఖా బోజ్ హీరోయిన్ గా ‘దామిని విల్లా’ అనే మూవీతో సంగీత దర్శకుడిగా మారాడు. దండం పోలా రావు నిర్మించిన ఈ సినిమాకు రాకేష్ రెడ్డి దర్శకుడుగా వ్యవహరించారు. ఈ మధ్యనే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది.. కానీ దురదృష్ట వశాత్తు ఆ సినిమా రిలీజ్ లోపే ప్రమోద్ కుమార్ కన్నుమూసారు. ప్రమోద్ కుమార్ మృతి సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.