సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవీ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల అయ్యింది. మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్తో దూసుకుపోతున్నాడు వీరయ్య. చిరు వింటేజ్ వైజ్.. డ్యాన్స్లో గ్రేస్ చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇక ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఓ రేంజ్ లో ఉంది. పూనకాలు లోడింగ్ అంటూ.. బాక్సాఫీస్ వద్ద వీరయ్య మాస్ జాతర కొనసాగిస్తున్నాడు. ఈక్రమంలో ‘వాల్తేరు వీరయ్య’ మూవీ టీమ్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ పై దేవి శ్రీ ప్రసాద్ ప్రశంసల వర్షం కురిపించారు. గతంలో ఆయన సినిమా ఇండస్ట్రీని వదలి రాజకీయాల్లోకి వెళ్తున్న సమయంలో ఇచ్చిన పార్టీకి తాను వెళ్లలేదని డీఎస్పీ అన్నారు. ఆయన అంత తక్కువ వయస్సులో సినిమాలు వదిలేయడం తనకు ఇష్టం లేదని, అందుకే పార్టీకి వెళ్లలేదని దేవి శ్రీ ప్రసాద్ తెలిపారు.
ఇక దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ…”వాల్తేరు వీరయ్య సినిమా ఇంతటి ఘన విజయం సొంతం చేసుకోవాడం చాలా సంతోషంగా ఉంది. ఇక దర్శకుడు బాబీ విషయానికి వస్తే.. చాలా క్లియర్ విజన్ తో సినిమాను తెరకెక్కిస్తారు. బాబీ మీద నాకు చాలా చాలా నమ్మకం. ఈరోజు వాల్తేరు వీరయ్య మూవీ సాధించిన ఈ ఘన విజయాన్ని నేను ముందే ఊహించాను. ఈ సినిమాకు నేను అందించిన సంగీతం ఎంతబాగా హిట్ అయిందో అందరికి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి నాకు పెద్ద కాంప్లిమెంట్ వచ్చింది. ఆయన దగ్గరి నుంచి ప్రశంసలు వచ్చాయంటే.. ఇక వర్డల్ అంతటి నుంచి వచ్చినట్లే.
మూవీస్ పరంగా మంచి పీక్ స్టేజి లో ఉన్న మెగాస్టార్.. సడెన్ గా ఓ రోజు తాను ఇండస్ట్రీని వదలేస్తున్నానని చెప్పి అందరికి షాక్ ఇచ్చారు. అందులో భాగంగా ఓ పార్టీ కూడా ఇచ్చారు. ఆ పార్టీకి నన్ను కూడా ఆహ్వానించారు. అయితే నాకు చాలా బాధ వేసి.. ఆ పార్టీకి కూడా వెళ్లలేదు. అరవింద్ సార్ కూడా నాకు ఫోన్ చేసి మరి పార్టీకి రమ్మని పిలిచారు. ఆ సంఘటన ఇప్పటికి నాకు బాగా గుర్తుంది. నాకు ఆ పార్టీనే ఓ షాక్ గా అనిపించింది. ఇలా సినిమాలు వదిలేస్తునందుకు పార్టీ ఇస్తారా? అనే ఆశ్చర్యం నాకు కలిగింది. ఇక అప్పటి నుంచి ఎంతో బెంగపెట్టుకున్నాము. చిరంజీవిగారితో ఎన్నో పాటలు చేయాలని అనుకున్నాము.
కానీ ఆయన మధ్యలోనే ఇండస్ట్రీని వదిలేస్తున్నారు అనే బాధ వేసింది. ఇలా నేనే కాక, ఎంతో మంది దర్శకులు సైతం బాధపడ్డారు. దేవుడు కరుణించి దాదాపు పదేళ్ల తరువాత మెగాస్టార్ తిరిగి ఇండస్ట్రికి వచ్చారు. అప్పటి వరకు కూడా ఆయన సింహాసనం అలాగనే ఉంది. ఇక వాల్తేరు వీరయ్య సినిమా ఇంతటిక ఘన విజయం అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా కోసం పనిచేసిన అందరికి నా కృతజ్ఞతలు” అని దేవి శ్రీ ప్రసాద్ అన్నారు. మెగాస్టార్ పై దేవి శ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.