ఆమె నటి. ఒకే ఒక్క తెలుగు సినిమా 'సీతారామం'తో అద్భుతమైన క్రేజ్ సంపాదించింది. ఇప్పుడు సౌత్-నార్త్ మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. తాజాగా తన లైఫ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేసింది.
సినీ ఇండస్ట్రీలోకి చాలా ఆటుపోట్లు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఎవరైనా సినిమాల్లోకి వెళ్తామని చెప్పగానే తల్లితండ్రులు అసలు ఎంకరేజ్ చేయరు. ఇక అమ్మాయిల విషయంలో అయితే పేరెంట్స్ సపోర్ట్ చేయడం సంగతి అటుంచితే ఒకవేళ ఒప్పుకొన్నా సరే చాలా భయపడతారు. ఈ క్రమంలోనే కొందరు అమ్మాయిలు మాత్రం ఎలాగైనా స్క్రీన్ పై కనిపించాలని తెగిస్తారు. నటన మీద మక్కువతో పేరెంట్స్ ని సైతం లెక్క చేయకుండా ఇండస్ట్రీలోకి వచ్చేస్తారు. అలా వచ్చి సక్సెస్ అయిన హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో మృణాల్ ఠాకూర్ ఒకరు. తాజాగా ఈమెనే ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మృణాల్ ఠాకూర్ పేరు చెప్పగానే అందరికీ ‘సీతారామం’ గుర్తుకొస్తుంది. ఈ సినిమా సక్సెస్ తో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. ఒక్క తెలుగులోనే కాదు పలు భాషల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. బాలీవుడ్ లోనూ పలు చిత్రాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. ఇకపోతే మృణాల్ జీవితం అంతా సాఫీగా సాగిందని అనుకోవచ్చు. కానీ ఇండస్ట్రీలోకి రావడానికి మృణాల్ కి కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చింది. చెప్పాలంటే ఈమె తల్లిదండ్రుల ఇండస్ట్రీ పేరెత్తగానే వద్దని చెప్పేశారు. ఇదే విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన మృణాల్.. పలు ఆసక్తికర విషయాలను రివీల్ చేసింది.
‘నిజానికి నేను సినిమాల్లోకి రావడం మా పేరెంట్స్ కి అసలు ఇష్టం లేదు. మాది మరాఠి ఫ్యామిలీ. వారికి ఇండస్ట్రీ గురించి అసలు తెలియదు. దీంతో వారు చాలా భయపడిపోయారు. సీరియల్స్ లో నటిస్తూ అక్కడ గుర్తింపు తెచ్చుకుని మూవీస్ లోకి వచ్చాను. ఎంచుకున్న పాత్రలు సినిమాలే నాకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇపుడు నా ఎదుగుదల చూసి మా తల్లిదండ్రులు గర్వపడుతున్నారు. ఇంతకన్నా ఏం కావలి’ అని మృణాల్ చెప్పుకొచ్చింది. పేరెంట్స్ ఎంకరేజ్ చేయకపోయినా సరే హీరోయిన్ అయిన మృణాల్.. ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ ఫేమ్ సంపాదించింది. దీనిపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.