తెలుగు ఇండస్ట్రీలో బాలీవుడ్ నుంచి ఎంతో మంది బ్యూటీలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ అతి కొద్ది మంది మాత్రమే స్టార్ డమ్ తేచ్చుకున్నారు. తెలుగు తెరపై స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న తర్వాత తమిళ, హిందీ ఇండస్ట్రీలోకి వెళ్లి సెటిల్ అవుతున్నారు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అయ్యింది ఈ పంజాబీ భామ మెహ్రీన్ కౌర్ పిర్జాదా. ఇటీవల ఎఫ్ 3 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా మెహ్రీన్ కి సంబంధించిన ఓ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఈ మద్య స్టార్ హీరోయిన్లు ఎక్కువగా సోషల్ మీడియాను ఫాలో అవుతున్నారు. హీరోయిన్ గా ఎంత బిజీగా ఉన్నా మెహ్రిన్ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి విషయం ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. అందం, అభినయంతో పాటు అల్లరిగా ఉండే ఈ అమ్మడు మొదటి చిత్రంతోనే ఘన విజయం అందుకుంది. ఇక రాజాది గ్రేట్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న మెహ్రిన్ ఎఫ్2, ఎఫ్ 3 విజయాలీతో టాలీవుడ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెంచుకుంది. తాజాగా మెహ్రిన్ ముఖంపై సూదులతో గుచ్చినట్టు ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీంతో మెహ్రిన్ కి ఏమైందా అని ఫ్యాన్స్ కంగారు పడ్డారు.
మెహ్రిన్ కి సంబంధించిన ఈ ఫోటో స్వయంగా ఆమె షేర్ చేసింది. కంగారు పడాల్సిన అవసరం లేదు.. ప్రస్తుతం తాన అందానికి మెరుగులు పెట్టుకుంటున్నట్టుగా.. ఈ థెరపీ ని ఆక్యు స్కిన్ లఫ్ట్ అంటారని.. ఓ డాక్టర్ పర్యవేక్షణలో ఈ చికిత్స చేయించుకుంటున్నట్టుగా మెహ్రీన్ తెలిపింది. ఈ థెరపీ తర్వాత ఫేస్ మరింత గ్లో తో అందంగా కనిపిస్తుందని మెహ్రిన్ చెబుతుంది. ఇటీవల చాలా మంది నటీమణులు ఆక్యు స్కిన్ లఫ్ట్ ట్రీట్ మెంట్ తో తమ అందానికి మెరుగులు పెట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ థెరపీ చేసినందుకు.. తన మొఖం మరింత అందంగా తీర్చిదిద్దినందుకు థెరపిస్ట్ కి థ్యాంక్స్ తెలుపుతూ న్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది మెహ్రిన్.