Mehaboob: బిగ్బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మెహబూబ్. ఓ వైపు డ్యాన్స్ వీడియోలు.. మరో వైపు షార్ట్ ఫిల్మ్లు, వెబ్ సిరీస్, సినిమాల్లో నటనతో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో తల్లి మరణంతో అతడి జీవితంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జులై 5వ తేదీన గుండెపోటు కారణంగా మహబూబ్ తల్లి మరణించింది. తల్లి మరణించి నెల రోజులు గడుస్తున్నా ఆ బాధనుంచి మెహబూబ్ తేరుకోలేకపోతున్నాడు. శనివారం తల్లి మరణంపై తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఎమోషన్ పోస్టు పెట్టాడు. ‘‘ నేను ఇప్పుడెలా నిర్ణయాలు తీసుకోవాలి?.. ప్రతీ రోజు ఎవరితో మాట్లాడాలి?
అమ్మా! నువ్వు లేకుండా నేనెలా బతకాలి? నువ్వు లేకుండా నేను నా జీవితాన్ని ఊహించుకోలేను. నువ్వు నాకు దేనికీ అడ్డుచెప్పలేదు. నేను అంచెలంచెలుగా ఎదుగుతుంటే చూశావ్. నువ్వు నా ఒడిదుడుకుల్లో తోడుగా ఉన్నావ్. నీ మాటల్తో నాలో స్పూర్తిని నింపావ్. అవి నన్ను అన్ని వేళలా మోటివేట్ చేశాయి. మా కోసం ఎంతో పోరాటం చేశావు. నీ జీవితంతో కూడా. మమ్మల్ని బాగా చూసుకోవటానికి ఎవ్వరూ చేయనంతగా నువ్వు మా కోసం చేశావ్. మాకోసం నీ సర్వస్వాన్ని త్యాగం చేశావ్.
అమ్మా! నువ్వు లేకుండా నా జీవితం ఎటుపోతుందో, ఎక్కడికి పోతుందో అర్థం కావటం లేదు. నేను నిన్ను ప్రతీ సెకన్ మిస్ అవుతాను. నువ్వు నాకు జీవితం అంటే ఏంటో నేర్పించావు. అమ్మా! నువ్వు నన్ను చూస్తుంటావు. నువ్వు గర్వపడేలా చేస్తాను. నీకు ప్రతిజ్ఞ చేస్తున్నాను. నాన్నను, సుబాన్ను మంచిగా చూసుకుంటాను…….’’ అంటూ రాసుకొచ్చారు. మరి, మెహబూబ్ ఎమోషనల్ పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Allu Sneha Reddy: మోడ్రన్ లుక్కులో బన్నిని మించిపోయిన స్నేహా రెడ్డి.. ఫోటో వైరల్..