చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు మంజిమ మోహన్. తెలుగులో తీసింది రెండు,మూడు సినిమాలే అయినా.. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2022లో ఆమె గౌతమ్ కార్తీక్ను పెళ్లి చేసుకున్నారు.
ప్రముఖ తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన ‘సాహసమే స్వాసగా సాగిపో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు హీరోయిన్ మంజిమ మోహన్. ఈ సినిమాలో నాగ చైతన్యకు జంటగా నటించారామె. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాపుగా నిలిచింది. అయినప్పటికి మంజిమ మోహన్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. తర్వాత ఆమె ‘ఎన్టీఆర్.. కధానాయకుడు, మహానాయుకుడు’ సినిమాల్లో ఓ పాత్ర చేశారు. ఈ సినిమాల తర్వాత తెలుగులో అవకాశాలు తగ్గిపోవటంతో తమిళ సినిమాలకే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ బహుభాషా నటుడు కార్తీక్ కుమారుడు గౌతమ్ కార్తీక్తో ప్రేమలో పడ్డారు.
ఈ ఇద్దరూ కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి 2022 డిసెంబర్ నెలలో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్గా ఉంటున్నారు. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్తో పంచుకుంటూ ఉన్నారు. తాజాగా, ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో ‘‘ మనం ముందుగా.. అతి ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే..
మన అభద్రతా భావాల్ని అంగీకరించాలి. అవి చాలా సాధారణమైనవని అర్థం చేసుకోవాలి. వాటిని దూరం చేసుకోవటానికి పని చేయాలి. కొన్ని సార్లు అందుకు కొంత సమయం పడుతుంది. కానీ, చాలా ఓపిగ్గా ఉండాలి’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మంజిమ ఏ విషయంలో అభద్రతా భావానికి గురవుతుందో అంతుచిక్కని విషయమే. మరి, మంజిమ మోహన్ అభద్రతా భావంపై పెట్టిన పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.