త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ (63), ఆయన భార్య మధులిక సహా 14 మంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తమిళనాడులోని నీలగిరి జిల్లా కన్నూర్ సమీపంలో కూలిన ఘటనలో 13 మంది దుర్మణం పాలయిన ఘటన యావత్ భారతాన్ని కన్నీటిపర్యంతం చేసింది. తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లా కురుబకోట మండలం ఎగువరేగడ గ్రామానికి చెందిన సాయి తేజ(29) దుర్మరణం పాలయ్యారు.
సాయి తేజ.. సీడీఎస్ బిపిన్ రావత్కు వ్యక్తిగత భద్రతా అధికారిగా సాయితేజ్ విధులు నిర్వహిస్తున్నారు. సాయితేజ్కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. భార్య పేరు శ్యామల. కొడుకు మోక్షజ్ఞ, కూతురు దర్శిని. సాయితేజ ఆకస్మికమరణంతో తల్లిదండ్రులు, భార్య కన్నీరుమున్నీరు అవుతున్నారు. తాజాగా అమర జవాన్ సాయితేజ కుటుంబానికి అండగా నిలిచారు మా అధ్యక్షులు మంచు విష్ణు.
భవిష్యత్ లో సాయితేజ కుటుంబానికి తాము అండగా ఉంటామని మంచు విష్ణు ప్రకటన చేశారు. సాయితేజ కొడుకు కుమార్తెల చదువు ఖర్చులు మొత్తం తన విద్యానికేతన్ బరిస్తుందని ప్రకటన చేశారు మంచు విష్ణు. వాళ్ల చదువులు పూర్తయ్యే వరకు మా సంస్థ లోనే ఉచితంగా చదివిస్తామని పేర్కొన్నారు మంచు విష్ణు. సాయితేజ కుటుంబీకులను కలిసి ఆర్థికసాయంపై మంచు విష్ణు పీఏ చర్చించారు.