Madhu Priya Tho Bathuku Paata : గత కొన్నేళ్లుగా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలతో ప్రేక్షకుల అభిమానాన్ని, ప్రేమను చూరగొంటుంన్న సుమన్ టీవీ ఈ ప్రయత్నంలో మరో ముందడుగు వేసింది. ‘మధు ప్రియతో బతుకు బాట’ పేరిట జానపదానికి పట్టాభిషేకం చేయబోతోంది. ప్రముఖ గాయకురాలు మధు ప్రియ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా పల్లెల్లోని జానపద పాటలను, గాయకులను జనానికి పరిచయం చేయనుంది. మట్టిలోని మాణిక్యాలను వెలుగులోకి తీసుకురానుంది. ఓ మంచి వేదిక, అవకాశం కోసం ఎదురు చూస్తున్న జానపద గాయకులు ఎవరైనా ఈ కార్యక్రమంలో పొల్గొనొచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా.. 08069387785 నెంబర్కు సంప్రదించండి.