మంచో చెడో నలుగురు.. తమ సినిమా గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడంతా ఇదే ట్రెండ్. ప్రతి చిత్రబృందం ఈ ఫార్ములానే అనుసరిస్తూ వెళ్తోంది. అంతెందుకు ఈ మధ్య ‘ది లెజెండ్’ అని ఓ సినిమా వచ్చింది. ఫలితం గురించి పక్కనబెడితే.. రిలీజ్ టైములో సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి మాట్లాడుకోనివాడు లేడంటే అతిశయోక్తి కాదేమో. అంతలా పాపులర్ అయింది. నెటిజన్స్ ఇంతలా చర్చించుకోవడానికి ఒకే ఒక్క రీజన్ హీరో అరుళ్ శరవణన్.
ఇక వివరాల్లోకి వెళ్తే.. వ్యాపారవేత్త అరుళ్ గురించి తెలుగువాళ్లకు తెలీకపోవచ్చు. కానీ తమిళనాట చాలామందికి తెలుసు. చెన్నైలో ఈయనకు ఎన్నో షాపింగ్ మాల్స్ ఉన్నాయి. వాటికి ఈయనే ప్రచారం చేస్తారు. అందుకు సంబంధించిన యాడ్స్ కూడా మీకు యూట్యూబ్ లో దొరుకుతాయి. వ్యాపారవేత్తగా సక్సెస్ అయినప్పటికీ.. శరవణన్ కి యాక్టింగ్ అంటే ఆసక్తి. రాజు తలుచుకుంటే ఎంతసేపు అన్నట్లు.. ఏకంగా 50 ఏళ్ల వయసులో హీరోగా ‘ది లెజెండ్’ అని సినిమా చేశారు. ఆయన నిర్మాణంలోనే తీసిన ఈ సినిమా.. కొన్నిరోజుల క్రితం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
హీరోగా చేయాలనే ఆసక్తి ఉండటం, సొంత నిర్మాణం కావడంతో దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్ పెట్టేశారు. హీరోయిన్ ఊర్వశి రౌతేలాకు అయితే రూ.3 కోట్లకు పైగా రెమ్యునరేషన్ ఇచ్చినట్లు టాక్ వినిపించింది. ఫస్ట్ సినిమానే పాన్ ఇండియా రేంజ్ లో శరవణన్ విడుదల చేశారు. ఈ సినిమా ఆడియెన్స్ కి అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయినా సరే రెండో సినిమా చేసేందుకు శరవణన్ రెడీ అయిపోయారు. ఇదే విషయాన్ని తమిళ ఫిల్మ్ క్రిటిక్ రమేశ్ బాలా ట్వీట్ చేశారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనుందని పేర్కొన్నారు. ఇది చూసిన నెటిజన్స్.. తలో రకంగా కామెంట్స్ పెడుతున్నారు. మరి ‘లెజెండ్’ శరవణన్ రెండో సినిమా స్టార్ట్ కానుండటంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: ఎవరీ లెజెండ్ శరవణన్? వేల కోట్లకి వారసుడు! బాషా రేంజ్ ఫ్లాష్ బ్యాక్!