నటిగా ఎంతోమంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్న ఖుష్బూ.. ప్రస్తుతం 'జబర్దస్త్' జడ్జిగా చేస్తోంది. రీసెంట్ గా జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితురాలైన ఆమె.. తన జీవితంలోని చేదు నిజాన్ని రివీల్ చేసింది.
సెలబ్రిటీలు చూడగానే వాళ్లకంటి లగ్జరీ బతుకు.. ఇల్లు, కార్లు, బంగ్లా, చేతి నిండా సినిమాలు అని చాలామంది అసూయ పడతారు. అయితే ఇదంతా నాణెనికి ఒకవైపు మాత్రమే. సదరు సెలబ్రిటీల జీవితంలోనూ మనకు తెలియని ఎన్నో దారుణమైన విషయాలు ఉంటాయి. వాళ్లలోనూ పలువురికి చేదు అనుభవాలు ఎదురై ఉంటాయి. ఈ విషయాన్ని ఏదైనా సందర్భం వస్తే తప్పించి బయటపెట్టారు. ఇప్పుడు కూడా ప్రముఖ నటి ఖుష్బూ షాకింగ్ సీక్రెట్ రివీల్ చేసింది. ఇది విని ప్రతి ఒక్కరూ షాకవుతున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ముంబయిలో ఓ ముస్లిం కుటుంబంలో పుట్టిన ఖుష్బూ బాలనటిగా ఇండస్ట్రీలోకి వచ్చింది. వెంకటేష్ ‘కలియుగ పాండవులు’ మూవీతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత తెలుగుతోపాటు తమిళం, హిందీలోనూ హీరోయిన్ గా చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. డైరెక్టర్ సుందర్ ని పెళ్లి చేసుకున్న తర్వాత యాక్టింగ్ కు కొన్నేళ్ల పాటు పూర్తిగా బ్రేక్ ఇచ్చిన ఖుష్బూ.. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అలా తెలుగులోనూ పలువురు చిరు, పవన్ కల్యాణ్ లాంటి స్టార్స్ సినిమాల్లో యాక్ట్ చేసింది. తాజాగా జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా అపాయింట్ అయిన ఈమె.. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ కార్యక్రమంలో పాల్గొని తన జీవితంలోని చేదు విషయాల్ని బయటపెట్టింది.
‘ఓ అబ్బాయి లేదా అమ్మాయి చిన్నతనంలో వేధింపులకు గురైతే.. అది వాళ్లని జీవితాంతం భయానికి గురిచేస్తుంది. తన భార్యపిల్లల్ని చిత్రహింసలు పెట్టడం, ఏకంగా కన్న కుమార్తెపైనే లైంగిక వేధింపులకు పాల్పడటం జన్మహక్కుగా భావించే వ్యక్తి వల్ల నా తల్లి, తన వైవాహిక జీవితంలో చాలా ఇబ్బందులు పడింది. 8 ఏళ్ల వయసులోనే నేను లైంగిక వేధింపులని ఫేస్ చేశాను. ఈ విషయాన్ని చెబితే అమ్మ నమ్ముతుందో లేదో అని ఎంతో భయపడ్డాను. ఎందుకంటే ఏం జరిగినా తన భర్త దేవుడు అని నమ్మే మనస్తత్వం ఆమెది. 15 ఏళ్ల వయసులో ఆయనకు ఎదురుతిరగడం స్టార్ట్ చేశాను. నాకు 16 ఏళ్లు రాకముందే ఆయన మమ్మల్ని వదిలివెళ్లిపోయాడు. ఆ టైంలో మేం ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం’ అని నటి ఖుష్బూ చెప్పుకొచ్చింది. మరి ఖుష్బూ చెప్పిన విషయంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.