తెలుగు చిత్ర పరిశ్రమలో కోడి రామకృష్ణ ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాలు తెరెక్కించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. టాలీవుడ్లో చరిత్రలో రామకృష్ణ రచయితగా, దర్శకుడిగా తన మార్క్ను లికించుకున్నాడు. భక్తిభావంతో నిండిన సినిమాలు తీయాలంటే రామకృష్ణ తర్వాతే ఎవరైన అనేలా నిలిచిపోయాడు. తెలుగులో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అనే చిత్రంతో దర్శకుడిగా మారాడు.
అనంతరం దేవి, దేవిపుత్రుడు, దేవుళ్లు, అంజి, అరుంధతి వంటి విభిన్నసినిమాలు చేసి అనేక విజయాలను సాధించాడు ఈ దర్శకుడు. వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన ఈయన ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఇక అనారోగ్యంతో రామకృష్ణ 2019 ఫిబ్రవరి 22న తుది శ్వాస విడిచారు. ఆయన మరణం తర్వాత భక్తి భావంతో నిండినటువంటి సినిమాలు తెరకెక్కించేందుకు ఏ దర్శకుడు కూడా ముందుకు రాకపోవటం విశేషం.
ఇక ఇదిలా ఉండగా ఆయన పెద్ద కూతురు కోడి దివ్య దీప్తి రామకృష్ణ లోటును భర్తీ చేసేందుకు టాలీవుడ్లోకి ఏంట్రీ ఇచ్చింది. తండ్రి రచయితగా, దర్శకుడిగా రాణించటంతో తను కూడా దర్శకత్వం వైపు వెళుతుందేమో అనుకుంటే పొరపాటే. అవును మీరు విన్నది నిజమే.. దివ్య దర్శకత్వం వైపు వెళ్లకుండా నిర్మాతగా మారుతున్నానని తెలిపింది. కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ అనే ప్రొడక్షన్ హౌస్ను ప్రారంభించి నిర్మాతగా మారారు. రాజా వారు రాణి గారు అనే సినిమాతో నిర్మాతగా తొలి అడుగు వేసింది దివ్య. ఇక తను తర్వాత చేయబోయే సినిమాలో హీరోగా నటిస్తున్నారు కిరణ్ అబ్బవరం. నేడు ఆయన పుట్టిన రోజు కావటంతో శుభాకాంక్షలు తెలిపుతూ తమ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఓ పోస్టర్ను విడుదల చేసింది చిత్ర యూనిట్.