తెలుగు సినిమాల్లో కమెడియన్ పాత్రలో కనిపిస్తూ అందరిని మెప్పిస్తున్నారు నటుడు కాదంబరి కిరణ్. సినిమాల్లో కమెడియన్ పాత్రలే కాకుండా అటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా రాణిస్తూ ఇప్పటికి సుమారుగా 270పైగా సినిమాల్లో నటించాడు. అయితే కాదంబరి కిరణ్ అందరికీ ఓ నటుడిగా మాత్రమే తెలుసు. కానీ ‘మనం సైతం’ అనే సంస్థను స్థాపించిన ఆయన పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. కాదంబరి కిరణ్ గతంలో విడుదలైన ‘నారప్ప’ ‘భీమ్లా నాయక్’ వంటి సినిమాల్లో కనిపించి తన నటనతో ఆకట్టుకున్నారు.
ఇక విషయం ఏంటంటే? ఇటీవల సుమ హోస్ట్ గా వ్యవహిరిస్తున్న ‘క్యాష్’ షోకి విచ్చేశారు కాదంబరి కిరణ్. ఇందులో ఈయనతో పాటు జోగి బ్రదర్స్, రాగిణి కూడా కంటెస్టెంట్లుగా పాల్గొనడం విశేషం. గేమ్ లో భాగంగా సుమ.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అనే రెండు ఆప్షన్లు ఇచ్చి.. ఇద్దరిలో ఎవరితో గడిపిన క్షణాలు మధురం అని చెబుతారు? అంటూ ప్రశ్నించింది. దీనికి కాదంబరి కిరణ్ సమధానిమిస్తూ.. మహేష్ బాబుతో కంటే కూడా పవన్ కళ్యాణ్ తో గడిపిన క్షణాలే మధుర క్షణాలు. పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఎక్కువ సినిమాలు చేశానని తెలిపారు.
ఇది కూడా చదవండి: పాన్ ఇండియా మార్కెట్ పై కన్నేసిన మంచు విష్ణు!
ఇక నేను నడుపుతున్న ‘మనం సైతం’ ఫౌండేషన్ ను ఆయన మనసుకి దగ్గరగా తీసుకున్నారని అన్నారు. మరో విషయం ఏంటంటే.. ఆయన హైదరాబాద్ లో ఆఫీస్ ప్రారంభించినప్పుడు 18 మంది గెస్టులని పిలవగా అందులో నేను కూడా ఒకడిని కావడం విశేషం. ఆ గుర్తింపు రావడానికి కారణం ‘మనం సైతం’ సంస్థే కారణమని గతంలో త్రివిక్రమ్ కూడా చెప్పారని కాదంబరి వివరించారు. ఆ రోజు నన్ను చూసిన వెంటనే ఇతను జనం కోసం బ్రతికే మనిషి అని గుర్తు చేసే హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకడు.
మహేష్ బాబుతో కలిసి సినిమాలు చేశాను. కానీ అంత ర్యాపో లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు కదాంబరి కిరణ్. తాజాగా కాదంబరి కిరణ్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారాయి. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ల పై కాదంబరి కిరణ్ చేసిన ఈ షాకింగ్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.