మెగాస్టార్ చిరంజీవి.. ఈ మాటకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే.. సామాన్యులు మాత్రమే కాదు అన్నీ రంగాల్లో సెలబ్రెటీలు కూడా మెగాస్టార్ పై మక్కువ చూపిస్తుంటారు. ఇక తెలుగు మీడియా జర్నలిస్ట్ ల్లో కూడా చిరు ప్రేమని పొందిన వారు లేకపోలేదు. వారిలో సుమన్ టీవీ జర్నలిస్ట్ ప్రభు ముందు వరుసలో ఉంటారు. ఇక తాజాగా.. మెగాస్టార్ మంచి మనసుని తెలిపే ఓ ఘటనని జర్నలిస్ట్ ప్రభు బయట పెట్టారు.
సీనియర్ సినిమా జర్నలిస్ట్ ప్రభు రచించిన ‘శూన్యం నుంచి శిఖరాగ్రాలకు’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ.. ‘అక్టోబర్ 28 నా పుట్టిన రోజు.. మెగాస్టార్ చిరంజీవికి ఆ రోజు వీలైతే మీరు డేట్ ఇవ్వండి.. లేదా మీకు వీలైన సమయంలో పుస్తకావిష్కరణ కార్యక్రాన్ని ఏర్పాటు చేసుకుంటానని అన్నాను.. దానికి చిరంజీవి ఓకే చెప్పారు. వాస్తవానికి ఈ పుస్తకావిష్కరణ ఎప్పటి నుంచో చేయాలని అనుకుంటున్నప్పటికీ వాయిదా పడుతూ వచ్చింది.
మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడైతే డేట్ ఇచ్చారో.. అన్ని పనులు వెంటనే జరిగిపోయాయి.. పుస్తకం ప్రింట్ కూడా అయ్యింది. ఇక పుస్తకావిష్కరణ కోసం హాల్ బుక్ చేసుకొని భోజనాలు ఏర్పాటు చేయడానికి నేను సిద్దమయ్యాను.. అడ్వాన్స్ ఇవ్వడానికి వెంకట్ రావు వద్దకు రాగానే దానికి సంబంధించిన అమౌంట్ అప్పుడే వచ్చేసిందని.. మీ పేరున హాల్ బుక్ అయిపోయిందని చెప్పడంతో నేను ఒక్కసారే షాక్ అయ్యాను. చిరంజీవి మేనేజర్ వచ్చి దీనికి సంబందించిన పేమెంట్ ఇచ్చారని చెప్పడంతో నాకు మాటలు రాలేదు. మెగాస్టార్ చిరంజీవికి నామీద ఉన్న అభిమానం అలాంటిది.
నేను దర్శకులు దాసరి నారాయణరావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో ఆ ఫీల్డ్ వదిలి ఫిలిం జర్నలిస్ట్ గా టర్న్ తీసుకొని ఒక పత్రికలో పనిచేస్తున్న సమయంలో చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఆ ఆర్టికల్ చదివిన చిరంజీవి.. నన్ను మెచ్చుకుంటూ ఒక లెటర్ పోస్ట్ పోస్ట్ చేశారు.. ఆ లేటర్ నాకు ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చి, నన్ను ఈ స్థాయికి తీసుకు వచ్చింది. అందుకే చిరంజీవి ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తారు. అలాంటి మెగాస్టార్ నా పుస్తకావిష్కరణ కార్యక్రమానికి రావడం ఎంతో సంతోషంగా ఉందని జర్నలిస్ట్ ప్రభు మాట్లాడారు. చూశారు కదా.. కళల పట్ల, కళాకారుల పట్ల మెగాస్టార్ చిరంజీవి చూపించే ప్రేమానురాగాలకు ఇది ఓ నిదర్శనంగా చెప్పుకోవచ్చు.