పంచ్ ప్రసాద్ అనారోగ్య పరిస్థితిపై మంత్రి ఆర్కే రోజా ముఖ్యమంత్రికి వివరించారు. ఆర్థిక సాయం అందించేలా చేశారు. దీనిపై పంచ్ ప్రసాద్ సంతోషం వ్యక్తం చేశాడు.
జబర్థస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ గత కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొన్ని రోజుల క్రితం ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. డాక్టర్లు కిడ్నీ ఆపరేషన్ వీలైనంత త్వరగా చేయాలని తేల్చిచెప్పారు. దీంతో ఆపరేషన్ కోసం అవసరమైన డబ్బు మొత్తాన్ని పోగు చేసే పనిలో పడింది పంచ్ ప్రసాద్ కుటుంబం. ఈ మేరకు నటుడు ఆది సహాయం చేయటంతో పాటు ఎవరికి తోచినంత వారు సాయం చేయాలంటూ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్టు కూడా పెట్టారు. ఆ పోస్టు వైరల్ కావటంతో పంచ్ ప్రసాద్ కొంత సాయం అందింది.
అయినప్పటికి ఆ మొత్తం ఆపరేషన్కు సరిపోలేదు. ప్రసాద్ కుటుంబం మరింత సాయం కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఏపీ ప్రభుత్వం సాయం చేయటానికి ముందుకు వచ్చింది. ప్రసాద్ ఆపరేషన్కు అవసరమైన సాయాన్ని చేసింది. దీనిపై ప్రసాద్ తాజాగా స్పందించారు. సీఎం జగన్ సాయంపై సంతోషం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ మీ సాయం ఎన్నటికీ మర్చిపోలేను. నా ఆరోగ్య సమస్యను మంత్రి రోజా గారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. నా చికిత్స అవసరమైన డబ్బును సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరు చేయించారు.
సీఎం జగన్, మంత్రి రోజాకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు. కాగా, పంచ్ ప్రసాద్కు ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ముందుకొచ్చి ఆర్థిక సహాయం చేశారు. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి కూడా పంచ్ ప్రసాద్ కి తన వంతు ఆర్థిక సహాయం అందజేశారు. మరికొన్ని రోజుల్లో ప్రసాద్కు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరగనుంది. మరి, పంచ్ ప్రసాద్కు ఏపీ ముఖ్యమంత్రి సాయం అందించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.