పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ అయిన సంగతి తెలిసిందే. ఓవైపు పాన్ ఇండియా మైథాలజీ మూవీ ఆదిపురుష్ కంప్లీట్ చేసి.. మరోవైపు సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో పాటు డైరెక్టర్ మారుతీతో ఓ సినిమా పూర్తిచేసే పనిలో ఉన్నాడు. అయితే.. వీటిలో మారుతితో చేస్తున్న సినిమా సౌత్ వరకే రిలీజ్ కాబోతుందని తెలుస్తోంది. ‘రాజా డీలక్స్’ అనే వర్కింగ్ టైటిల్ తో ప్రచారంలో ఉన్న ఈ సినిమా ఇప్పటికే సింగిల్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హారర్ కామెడీ జానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఇక ఇప్పటికే అంచనాలు సెట్ చేసిన ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ వారు నిర్మిస్తున్నారు. కాగా, శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. జనరల్ గా ఒక సినిమాలో యూస్ చేసిన సెట్స్ ని మరో సినిమాలో వాడటం అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. కాకపోతే.. ఒకే సెట్ అయినప్పటికీ, సినిమా కంటెంట్ కి అనుగుణంగా మార్పులు చేస్తుంటారు మేకర్స్. ఈ క్రమంలో ప్రభాస్ – మారుతిల సినిమాలో సెట్ విషయంపై ఓ వార్త చర్చనీయాంశంగా మారింది. అవును.. ఇంతకీ ఆ సెట్ కథేంటంటే.. ఆచార్య సినిమా కోసం వేసిన ధర్మస్థలి సెట్ ని ప్రభాస్ సినిమా కోసం యూస్ చేసే ప్లాన్ లో ఉన్నాడట మారుతి.
ఈ విషయం ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది.. కానీ, మేకర్స్ నుండి ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే.. ధర్మస్థలి సెట్ తో ఈ సినిమాకి సంబంధం ఏంటని.. మధ్యలో ధర్మస్థలి ఎందుకు తీసుకొస్తున్నారని ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి డైరెక్టర్ మారుతి మైండ్ లో ఎలాంటి ఆలోచన ఉందో తెలియాలంటే అధికారికంగా అనౌన్స్ చేసేవరకు ఆగాల్సిందే. ఇదిలా ఉండగా.. ప్రభాస్ ఫ్యాన్స్ ఆదిపురుష్ సినిమా కోసం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు కూడా రాబోతున్నాయి. ఈ లెక్కన ప్రభాస్ రేంజ్ ఇంకా పాన్ వరల్డ్ రేంజ్ కి పెరిగే అవకాశం ఉందని అంటున్నాయి సినీవర్గాలు. మరి ప్రభాస్ – మారుతి సినిమా విషయంలో వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి.