తెలుగు సినీ పరిశ్రమలో శోభన్ బాబుకు ఉన్న క్రేజ్ వేరు. నందమూరి ఎన్టీఆర్, అక్కినేని తర్వాత అంతటి గొప్పగా నటనతో మెప్పించిన హీరో శోభన్ బాబు. శోభన్ బాబు చిత్రాలను లేడీస్ చాలా ఇష్టపడతారు. ఎందుకంటే ఆయన ఎక్కువగా కుటంబ కథా చిత్రాలు తీశారు కాబట్టి.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ హీరోల తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న హీరో శోభన్ బాబు. తన నటనతో తెలుగు సినిమాల్లో సోగ్గాడిగా పేరు ప్రతిష్టలు పొంది వ్యక్తి శోభన్బాబు. ఈ అందగాడు తీసిన సినిమాలు చాలా పాపులర్ అయిన మాట అందరికి తెలిసిందే. ఈ హీరో తీసిన సినిమాల్లో ఎక్కువగా ఇద్దరు హీరోయిన్స్ తోనే కథ నడిపేవారు. కుటుంబ కథా చిత్రాలు ఎక్కువగా నటించి మెప్పించిన నటుడు శోభన్బాబు. ‘డాక్టర్బాబు’ సినిమా శోభన్బాబు, జయలలిత కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా.ఈ సినిమాతో వారి ఇరువురి మధ్య పరిచయం పెరిగింది.
ఓసారి మద్రాసులోని తన ఇంటికి డిన్నర్ కి పిలిచి తనే స్వయంగా వడ్డించింది. శోభన్బాబుపై ప్రత్యేక అభిమానం చూపించిన జయలలితకు ముగ్దుడయ్యాడు. శోభన్ బాబుకు వడ్డించే ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సినిమాల మాదిరిగా వీరి జీవితాలు కూడా ఎన్నో మలుపులు తిరిగాయి.
ఆర్థికంగా శోభన్ బాబు ఎంతో బలవంతుడైనా కూడా మానసికంగా చాలా పరిమితులున్నాయి. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా శోభన్ బాబు, జయలలిత సినిమాలు తీసారు. వారి ఇద్దరి స్నేహపూర్వక సంబంధంపై అనేక కథనాలు వినిపించాయి. వీరి పరిచయం కాస్త సహజీవనానికి దారి తీసింది. వీరి బంధానికి గుర్తుగా ఓ పాప కూడా ఉందని ప్రచారం జరిగింది.
సినీ పరిశ్రమ హైదరాబాద్ కు తరలించుటకు ఎన్టీఆర్, అక్కినేని చాలా కృషి చేశారు. ఆ సమయంలోనే శోబన్ బాబు కూడా హైదరాబాద్ లో స్టూడియో కట్టేందుకు సన్నాహాలు జరిగాయి. అయినా తమిళనాడు వదిలి వెళ్ళవద్దని జయలలిత కోరడంతో శోభన్ బాబు తమిళనాడులోనే ఉండిపోయారు. జయలలిత కోసం చేసిన త్యాగాలలో ఇదికూడా ఓ త్యాగం. జయలలిత రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత శోభన్ బాబు కూడా సినిమాలకు దూరం అయ్యారు. సినిమాలను వదులుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారాలపై ఎక్కువగా ఫోకస్ చేశారని తెలిసిన సమాచారం.