Himanshu Malik: సినిమా అన్నది రంగుల ప్రపంచం మాత్రమే కాదు.. మాయా ప్రపంచం కూడా. ఈ సినీ మాయలో పడి చాలా మంది మోసపోతుంటారు. ఈ మోసాలను తట్టుకుని, గుండె ధైర్యం, అదృష్టంతో పైకి వచ్చేవాళ్లు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. మిగిలిన వాళ్లు ఎన్నో ఆశలతో ఈ రంగుల ప్రపంచంలో అడుగుపెట్టి.. చివరకు వాస్తవం తెలుసుకుని చేతులు కాల్చుకుంటుంటారు. ఒక వేళ అదృష్టం బాగుండి అవకాశాలు వచ్చినా అది ఎంతకాలమో తెలీదు. దాన్ని నిలబెట్టుకోవటానికి పాడు పనులు చేసే వారు కూడా లేకపోలేరు. టాలీవుడ్-హాలీవుడ్ అన్ని పరిశ్రమల్లో ఇది మామూలుగా జరిగేదే. తాజాగా, ఓ ప్రముఖ నటుడు సినీ పరిశ్రమలోని చీకటి కోణాన్ని మరోసారి బయటపెట్టారు. తన సినీ జీవితంలో ఎదురైన ఛేదు అనుభవాన్ని మీడియా ముందు వెల్లడించారు.
బాలీవుడ్ నటుడు హిమాన్షు మాలిక్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ ‘తుమ్ బిన్’ సినిమా తర్వాత సినీ పరిశ్రమ ఎలాంటిదో తెలిసింది. ఆ సమయంలో మ్యాగజైన్స్కు చాలా పేరుండేది. ఓ రోజు ఓ పెద్ద మ్యాగజైన్ పబ్లికేషన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. నాకో ఎఫైర్ ఉండాలని వాళ్లు చెప్పారు. ‘నువ్వు ఓ కొత్త హీరోయిన్తో ఎఫైర్ పెట్టుకుంటే, అదో మంచి స్టోరీ అవుతుంది. పబ్లిసిటీ లేకుండా ఎవ్వరూ స్టార్ కాలేరు. మేము ఒకరిద్దరు హీరోయిన్స్తో మాట్లాడతాము. వాళ్లు కూడా నీలాగే ఫేమస్ కావచ్చు. మీ కోసం గోవాలో ఓ రూం కూడా తీస్తాం. మీరక్కడికి వెళ్లండి.. మిగిలింది మేం చూసుకుంటాం’ అని వాళ్లు అన్నారు.
నేను షాక్ అయ్యాను. సినీ పరిశ్రమలో ఏం జరుగుతోందో అప్పుడు అర్థం అయ్యింది. చాలా డిస్ట్రబ్ అయ్యాను’’ అని చెప్పుకొచ్చారు. కాగా, హిమాన్షు మాలిక్ 1996లో వచ్చిన ‘కామ సూత్ర’ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. 2001లో వచ్చిన ‘తుమ్ బిన్’తో మంచి పేరు తెచ్చుకున్నారు. 2018లో ‘3 స్టోరీస్’ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ చేశారు. ఇదే ఆయన చివరి సినిమా. ఆ తర్వాతినుంచి ఏ సినిమాలోనూ నటించలేదు. మరి, హిమాన్షు వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Actor Rajasekhar: శేఖర్ సినిమాపై కుట్ర చేస్తున్నారు, థియేటర్లలోంచి తీసేయిస్తున్నారు : రాజశేఖర్