మిల్కీబ్యూటీ అనగానే అందరికీ హీరోయిన్ తమన్నానే గుర్తొస్తుంది. అప్పుడెప్పుడో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ తర్వాత తమిళ, హిందీ చిత్రసీమలోనూ ఎన్నో సినిమాలు చేసింది. కోట్లాదిమంది ప్రేక్షకుల్ని సంపాదించుకుంది. ప్రస్తుతం ఓవైపు హీరోయిన్ గా చేస్తూనే మరోవైపు యాక్టింగ్ ప్రాధాన్యమున్న పాత్రలు కూడా చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటోంది. రీసెంట్ గా పుట్టినరోజుని గ్రాండ్ గా జరుపుకొన్న ఆమె.. నటిగా తన కెరీర్ ప్రారంభంలో జరిగిన ఓ విషయం గురించి ఇప్పుడు రివీల్ చేసింది. అప్పుడు తన పని అయిపోయిందనుకున్నట్లు పేర్కొంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తమన్నా అనగానే మనకు అందరికీ గుర్తొచ్చే మూవీ ‘హ్యాపీడేస్’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ మూవీతో తమన్నా చాలా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేసింది. ఎప్పుడైతే సుకుమార్ డైరెక్షన్ లో ‘100% లవ్’ చేసిందో.. ఆ తర్వాత ఈ బ్యూటీ ఫేట్ మారిపోయింది. ఆ తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్, పవన్ కల్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో నటించి హిట్స్ కొట్టింది. అలా తెలుగులో సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా అందరి సినిమాల్లోనూ హీరోయిన్ గా నటించింది. ఈ ఏడాది ఎఫ్ 3, మాస్ట్రో, గని, బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ బీ, గుర్తుందా శీతాకాలం లాంటి సినిమాలు చేసింది.
ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కెరీర్ ప్రారంభంలో తనకు వచ్చిన ఆలోచనల గురించి బయటపెట్టింది. ‘అప్పుడు నా వయసు 15 ఏళ్లు, తొలిసారి ‘సాంద్ సా రోషన్ షహానా’ అనే హిందీ సినిమాలో నటించాను. అది ఫ్లాఫ్ అయింది. ఆ తర్వాత అదే ఏడాది తెలుగులో ‘శ్రీ’ మూవీ చేశాను. అది సక్సెస్ కాలేదు. దీంతో నా పని అయిపోయిందనుకున్నాను. అలాంటి టైంలో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ‘హ్యాపీడేస్’లో నటించే ఛాన్స్ వచ్చింది. అది హిట్ కావడంతో వరసగా అవకాశాలు రావడం మొదలైంది’ అని తమన్నా చెప్పింది. ఇప్పటివరకు చేసినవాటితో పాటు ఇంకా మంచి మంచి సినిమాల్లో నటించి, ఫ్యాన్స్ ని సంతోషపరచడమే తన కోరిక అని తమన్నా పేర్కొంది. మరి తమన్నా చెప్పిన దానిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.