ఎంత పెద్ద స్టార్స్ అయినా సరే చాలామంది దైవభక్తి ఉంటుంది. రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్.. ఏకంగా హిమాలయాలకు వెళ్తుంటారు. ఇక తెలుగు హీరోలు కూడా చిన్న పెద్దా అనే తేడా లేకుండా సినిమాల విడుదల టైంలో పుణ్యక్షేత్రాల్ని దర్శనాలతో బిజీగా మారిపోతుంటారు. ఇక హీరోయిన్స్ కూడా ఇందులో మినహాయింపు ఏం కాదు. సినిమాలు, సోషల్ మీడియాలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా భక్తి విషయం వచ్చేసరికి చాలా పద్ధతిగా సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తుంటారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. యువ హీరోయిన్, బిగ్ బాస్ బ్యూటీ నందినీ రాయ్ తాజాగా తిరుపతి దర్శనం చేసుకుంది. కాకపోతే పలువురు యాక్టర్స్ లా మెట్లపై నడిచి వెళ్తుంటారు. కానీ నందిని మాత్రం మోకాళ్లతో మెట్లు ఎక్కింది. అందుకు సంబంధించిన ఓ వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. కష్టపడి మెట్లు ఎక్కినప్పటికీ.. ఇది చాలా అద్భుతమైన అనుభూతి అని రాసుకొచ్చింది. ఇక ఈమె, ప్రతినాయక ఛాయలున్న పాత్ర చేసిన ‘భాగ్ సాలే’ త్వరలో విడుదల కానుంది.
ఇక నందినీ రాయ్ కెరీర్ విషయానికొస్తే.. 2011లో ‘ఫ్యామిలీ ప్యాక్’ అనే హిందీ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆ వెంటనే 040, హార్మోన్స్ లాంటి తెలుగు సినిమాలు చేసింది. ఆ చిత్రాలు రిలీజ్ అయినట్లు కూడా ఎవరికీ తెలీదు. ఆ తర్వాత తెలుగులో మాయ, మోసగాళ్లకు మోసగాడు, సిల్లీ ఫెలోస్, శివరంజని సినిమాలు చేసింది. వీటితోపాటు గాలివాన, హై ప్రీస్టెస్, షూటౌట్ ఎట్ ఆలేరు, మెట్రో కథలు, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ లాంటి వెబ్ సిరీసులు కూడా చేసింది. బిగ్ బాస్ రెండో సీజన్ తో గుర్తింపు తెచ్చుకున్న నందిని… ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీలోనూ పలు ప్రాజెక్టులు చేస్తోంది. సోషల్ మీడియాలోనూ గ్లామరస్ ఫొటోలు పోస్ట్ చేస్తూ పిచ్చెక్కిస్తోంది. మరి నందినీ.. తిరుపతి మెట్లు మోకాళ్లపై వెళ్లడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.