యంగ్ హీరో నిఖీల్, మలయాళ బ్యూటీ అనుప పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి తెరకెక్కించిన చిత్రం కార్తికేయ-2. నిఖిల్ గతంలో నటించిన సూపర్ హీట్ మూవీ ‘కార్తికేయ’ కు సీక్వెల్ గా కార్తికేయ-2ను తీశారు. ఈ సినిమా ఆగస్టు 13 ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీలో అనుపమ్ ఖేర్, ఆదిత్య, శ్రీనివాస రెడ్డి, సత్య కీలకపాత్రలో నటింటారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి హీరో నిఖిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కార్తికేయ-2 సినిమా పలుమార్లు వాయిదా వేయాలంటూ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఒత్తిడి చేసినట్లు వచ్చిన వార్తలను నిఖిల్ ఖండించాడు. కార్తికేయ-2 పలుమార్గు వాయిదా పడటానికి దిల్ రాజు కారణం కాదని నిఖిల్ స్పష్టంత నిచ్చారు. కార్తికేయ-2 టీమ్ నిర్వహించిన ఓ ఫంక్షన్ లో సినిమా వాయిదా గురించి తాను చేసిన వ్యాఖ్యలపై నిఖిల్ వివరణ ఇచ్చారు.
వైవిధ్యమైన సినిమాల ద్వారా ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్న నిఖిల్ తన తాజా చిత్రం కార్తికేయ-2ని విడుదల చేయడానికి నానా కష్టాలు పడ్డాడు. సుమారు 17 సినిమాలు చేసిన నిఖిల్కి థియేటర్ల సమస్య ఏర్పడటం చర్చనీయాంశంగా మారింది. దీనిపై తాజాగా నిఖిల్ మాట్లాడారు. దిల్ రాజు, సునీల్.. వంటి డిస్ట్రిబ్యూటర్ల వల్లే ఎలాంటి ఇబ్బందుల్లేకుండా కార్తికేయ-2 సినిమా విడుదలైందని ఆయన చెప్పుకొచ్చారు. ” దిల్ రాజు మా చిత్రాన్ని వాయిదా వేసుకోమన్నారని నేను ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పటివరకూ ఇచ్చిన ఏ ఇంటర్వ్యూలోనూ ఆయన పేరు వాడలేదు. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి దిల్ రాజు కూడా సహయపడ్డారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు. ప్రొడ్యూసర్స్ గిల్డ్ కొత్త పాత్ర పోషిస్తోంది.
ప్రస్తుతం ప్రేక్షకులెవరూ థియేటర్లకు రావడం లేదని, ఒకే సమయంలో ఇద్దరు హీరోల సినిమాలు విడుదలైతే వసూలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని.. కాబట్టి వాయిదా వేసుకోవాలని దాదాపు 15 మంది మమ్మల్ని అడిగారు. వాళ్ల మాట ప్రకారం మొదట వాయిదా వేశం. మరో హీరో సినిమా వస్తోందని.. మరోసారి వాయిదా వేశాం. మంచి చిత్రాన్ని వాయిదా వేసుకుంటూ వెళ్తున్నామని ఎంతో బాధపడ్డా. అంతే తప్ప నేను ప్రత్యేకంగా ఏ ఒక్క వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు” అని నిఖిల్ తెలిపాడు. మరి.. హీరో నిఖిల్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.