గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి తీవ్ర రూపంలో విజృంభిస్తుంది. సెకండ్ వేవ్ తర్వాత కేసులు సంఖ్య తగ్గాయి అనుకుంటున్న సమయంలో మళ్లీ కరోనా కోరాలు చాస్తుంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ నేతలు కరోనా భారిన పడుతున్నారు.. మరికొంత మంది కన్నుమూస్తున్నారు. బాలీవుడ్ సినీ గీత రచయిత ఇబ్రహీం ఆష్క్ (70) కరోనా మహమ్మారి సోకడంతో మరణించారు. ‘కహో నా ప్యార్ హై’, ‘కోయి మిల్ గయా’ ఫేమ్ గీత రచయిత ముంబైలోని మెడిటెక్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం చేరారు.
ఈ విషయాన్ని ఇబ్రహీం కుమార్తె ముసాఫా ఖాన్ చెప్పారు. ముసాఫా తన తండ్రికి శనివారం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడిందని.. ఆ తర్వాత ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. అయితే వైద్య పరీక్షల్లో ఇబ్రహీంకి కోవిడ్ -19 తో పాటు న్యుమోనియా సోకడంతో దాని ప్రభావం ఊపిరితిత్తులపై పడింది. అంతేకాదు ఇబ్రహీం ఎప్పటి నుంచో గుండెకు సంబందించిన వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్లు ఆయన కూతురు తెలిపారు. వెంటిలేటర్పై ఉంచి చికిత్సనందించారు వైద్యులు. అయితే ఇబ్రహీం ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
ఇది చదవండి : టెస్ట్ కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకోవడంపై ఎమోషనలైన అనుష్కశర్మ!
బాలీవుడ్ లో ‘కహో నా ప్యార్ హై’, ‘కోయి మిల్ గయా’, ‘ఇధర్ చలా మే ఉధర్ చలా’ , ‘ఆప్ ముఝే ఐ అచ్చే లగ్నా లగే, క్రిష్’, ‘వెల్ కమ్’, ‘ఐత్బార్’, ‘జన్షీన్’, ‘బ్లాక్ అండ్ వైట్’ వంటి అనేక సూపర్ హిట్ సినిమాలకు పాటలను అందించారు. అతనికి భార్య , ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నమని కుమార్తె తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ సెలబ్రెటీలు సంతాపాన్ని వ్యక్తం చేశారు.