కనీసం ఫస్ట్ లుక్ రాకముందే వాలిమై సినిమా భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ప్రస్తుతం అజిత్ హెచ్.వినోద్ దర్శకత్వంలో ఈ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఎలా ఉండబోతుందో గాని అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో ఛాన్స్ దొరికితే వాలిమై గురించి హంగామా చేసేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో వాలిమై చిత్రం నుండి ఎలాంటి అప్డేట్స్ లేకపోయినా అభిమానులు ఓ రేంజిలో అప్డేట్స్ కోసం ప్రపోసల్స్ తీసుకెళ్లారు.
ఇటీవలే విదేశాల్లో క్రికెట్ గ్రౌండ్ లో కూడా వాలిమై అప్డేట్ కావాలంటూ డిమాండ్ చేసిన విషయం వైరల్ అయిన సంగతి తెలిసిందే. అంటే అదంతా అభిమానమే అని చెప్పుకోవాలి. వెయిట్ చేసి చేసి ఫ్యాన్స్ అలాంటి నిర్ణయం తీసుకున్నారు. తర్వాత మెల్లగా మేకర్స్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి అభిమానులను సాటిస్ఫై చేసారు. ఇదిలా ఉండగా.. తాజాగా తలా అజిత్ అభిమానులకు కంగుతినే షాక్ ఇచ్చాడు. విషయం ఏంటంటే.. “నన్ను ఇకపై తలా అని పిలవకండి” అంటూ అటు ఫ్యాన్స్ కి, మీడియా వారికీ ట్విట్టర్ వేదికగా రిక్వెస్ట్ చేసాడు.
మరి ఎందుకని అలాంటి నిర్ణయం తీసుకున్నాడో తెలియదు కానీ.. తనను ఇకపై అజిత్ – అజిత్ కుమార్ లేదా ఏకే అంటూ పిలవచ్చునని పోస్టులో పేర్కొన్నాడు. మరి ఈ విషయం పై ఫ్యాన్స్ ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. ప్రస్తుతం షూటింగ్ ముగించుకున్న వాలిమై చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ బోనికపూర్ త్రిభాషా చిత్రంగా నిర్మిస్తున్నాడు. తెలుగు తమిళ హిందీ భాషల్లో రిలీజ్ కాబోతుంది.
— Suresh Chandra (@SureshChandraa) December 1, 2021