మూడు రంగుల జెండా ఎక్కడ కనిపించినా మనం జైహింద్ అంటూ సెల్యూట్ చేస్తాము. జాతి ఐఖ్యతకు ఈ సెల్యూట్ ఒక సూచిక. కాబట్టి.. మన దేశంలో ఏ రాష్ట్ర ప్రజలుకైనా త్రివర్ణ పతాకమే జాతీయ జెండా. కానీ.., కర్ణాటక రాష్ట్రంలో మూడు రంగుల జెండాతో పాటు, ఓ రెండు రంగుల జెండా కూడా కనిపిస్తూ ఉంటుంది.
చాలా మంది తెలియక దీనికి కన్నడ ప్రజలకు అధికారిక జెండా అని తప్పుగా అనుకుంటూ ఉంటారు. నిజానికి అలాంటిది ఏమి లేదు. కానీ.., కన్నడ ప్రజలు ఈ రెండు రంగుల జెండాకి కూడా చాలా గౌరవం ఇస్తారు. ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ చనిపోయిన నేపథ్యంలో మళ్ళీ ఈ జెండాలు కన్నడ నాట దర్శనం ఇస్తున్నాయి. బెంగుళూరులోని కంఠీరవ స్టేడియం అంతా ఈ జెండాలతోనే నిండిపోయింది. ఈ నేపథ్యంలో అసలు ఈ జెండా హిస్టరీ ఏమిటో తెలుసుకుందాం.
1956 నవంబర్ 1 న విశాల కన్నడ మాట్లాడే రాష్ట్రం ఏర్పడింది. తరువాత , 1973 నవంబర్ 1న మైసూర్ రాష్ట్రం కాస్త కర్ణాటక గా రాష్ట్రంగా మార్చబడింది. ఇలా ఏకీకృత కర్ణాటక రాష్ట్రం సాధించడానికి ఎంతో మంది పోరాటం చేయాల్సి వచ్చింది. వారు చేసిన పోరాటాన్ని, కృషికి చిహ్నంగా కన్నడిగులు ప్రతి సంవత్సరం నవంబర్ 1వ తేదీని ఘనంగా జరుపుకుంటారు.
ఆరోజు పసుపు, ఎరుపు రంగులతో కూడిన ద్వి రంగు జెండాని రాష్ట్రమంతటా ఎగరేస్తారు. అయితే.., ముందు జాతీయ జెండాని ఎగరేసిన తరువాత.., జాతీయ జెండా కంటే తక్కువ ఎత్తులోనే ఈ ద్వి రంగు జెండాని కూడా ఎగురవేస్తారు. ఈ రెండు రంగుల జెండా కర్ణాటక రాష్ట్ర సంస్కృతి, భాషలు, చరిత్రకి సూచిక మాత్రమే. ఇప్పుడు పునీత్ మరణం తరువాత కూడా ఆయన రాష్ట్రానికి చేసిన సేవని గుర్తు చేసుకుంటూ మాత్రమే కన్నడ ప్రజానీకం ఈ జెండాలను ఎగరేస్తున్నారు. ఇది కన్నడ ప్రజల ద్వి రంగు జెండా ప్రత్యేకత. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.