తాజాగా విజయవాడలో ఎన్టీఆర్ జయంతి వేడుకలో పాల్గొన్నారు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నందమూరి ఫ్యామిలీలో Jr.NTR ఒక్కడే అసలైన మగాడు అంటూ కామెంట్స్ చేశారు.
ఏపీలో గత రెండు రోజులుగా స్వర్గీయ నందమూరి తారకరామారావు (NTR) శత జయంతి వేడుకలు జరిగాయి. ఆయన జయంతి సందర్భంగా విజయవాడలోని ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్టు, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరిగాయి. అనంతరం నిర్వాహకులు శత జయంతి సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, మాజీ మంత్రి వెల్లంపల్లి, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి పార్వతి, కొమ్మినేని శ్రీనివాసరావు పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. అయితే, ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆర్జీవీ మాట్లాడుతూ.. నేను ఎన్టీఆర్ శత జయంతి వేడుకలో పాల్గొనడానికి రాలేదు. కేవలం ఓ జోక్ చెప్పటానికి మాత్రం ఇక్కడికి వచ్చాను. ఆ జోక్ చాలా సీరియస్ జోక్. ఎవ్వరూ నవ్వలేని ఆ జోక్.. రాజమండ్రిలో జరుగుతుంది. ఇది విని స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ కు సైతం నవ్వాలో, ఏడ్వాలో తెలియని పరిస్థితి. అయితే, చంద్రబాబు క్యారెక్టర్ ఎలాంటిది అనేది ఎన్టీఆర్ ఆనాడే చెప్పారు. లక్ష్మి పార్వతి మాయలో ఎన్టీఆర్ పడ్డారని కొందరు అంటున్నారు. ముఖ్యమంత్రిగా చేసిన ఆ మహా వ్యక్తికి అవగాహన లేదా? అవగాహన లేని వ్యక్తిని ఎందకు పూజిస్తున్నారు, దండలు ఎందుకు వేస్తున్నారు?
ఇక సూపర్ స్టార్ అయిన రజినీ కాంత్ సైతం అక్కడి నుంచి వచ్చి చంద్రబాబు పక్కనే కూర్చుని వాళ్లను పోగిడారు. ఇది ఒక రకంగా రజినీ కాంత్ కూడా ఎన్టీఆర్ ను వెన్నుపోటు పడొస్తున్నట్టే. ఎవరి మాయలో ఎవరు పడతారనేది కాంప్లికేటెడ్ క్వశ్చన్ గా మారిపోయింది. ఇక మొత్తానికి నందమూరి ఫ్యామిలీలో ఉన్న ఒకే ఒక్క మగాడు Jr.NTR. వాళ్లందరితో పాటు వేదికను పంచుకోకుండా, అక్కడికి వెళ్లకుండా ఉన్నారు. అందుకు కారణం వాళ్ల తాత మీద ఉన్న విపరీతమైన గౌరవంతో Jr.NTR ఒక విధానానికి కట్టుబడి ఉన్నాడంటూ రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవే వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. నందమూరి ఫ్యామిలీలో Jr.NTR ఒక్కడే అసలైన మగాడు అంటూ ఆర్జీవీ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.