తమిళ దర్శకుడు లింగుసామి కి చెక్ బౌన్స్ కేసులో శిక్ష పడిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం వరకు లింగుసామికి జైలు శిక్ష అని తెలిసేసరికి ఇండస్ట్రీలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. అయితే కోర్టు విధించిన అపరాధ రుసుమును తాజాగా లింగుసామి కట్టేశారు. కేసు వివరాల్లోకి వెళ్తే.. తమిళ్ లో దర్శకుడిగా మంచి పేరు ఉన్న లింగుసామిపై పీవీపీ క్యాపిటల్ అనే సంస్థ చెక్ బౌన్స్ కేసులో స్థానిక సైదాపేట కోర్టును ఆశ్రయించింది. తమ నుంచి దర్శకుడు లింగుసామి తీసుకున్న రూ.1.3 కోట్లు తిరిగి చెల్లించలేదని, ఆయన ఇచ్చిన చెక్ కూడా బౌన్స్ అయిందని సదరు సంస్థ పిటిషన్లో పేర్కొంది.
పిటిషన్ స్వీకరించిన సైదాబాద్ కోర్టు విచారణ చేపట్టింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం దర్శకుడు లింగుసామికి 6 నెలల జైలు శిక్ష విధించింది. తీసుకున్న డబ్బును వడ్డీతో పాటు చెల్లించాలని ఆదేశించింది. అదే సమయంలో రిట్ పిటిషన్ దాఖలు చేసుకోవడానికి అవకాశం కూడా ఇచ్చింది. దీంతో రూ.10 వేలును లింగస్వామి కోర్టుకు అపరాధ రుసుం చెల్లించాడు. కాగా ఇటీవలే లింగుసామి రామ్ తో “ది వారియర్” మూవీ తెరకెక్కించి ప్లాప్ ని ఖాతాలో వేసుకున్నాడు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.