‘ఉప్పెన’ సినిమా సాధించిన విజయం గురించి అందరికీ తెలిసిందే. మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో వెండితెరకు పరిచయం అయ్యాడు. మరోవైపు ఇండస్ట్రీకి ఒక మంచి డైరెక్టర్ కూడా పరిచయం అయ్యాడు. పంజా వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టిలు డెబ్యూ ఫిల్మ్ అయినా కూడా ఎంతో బాగా నటించారు. వైష్ణవ్కు యాక్టింగ్ పరంగా మంచి మార్కులు పడ్డాయి. బాక్సీఫీసు వద్ద కూడా ఎంతో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది ఉప్పెన. అంత డిఫరెంట్ సబ్జెక్ట్ రాసి.. ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన బుచ్చిబాబు డెబ్యూ ఫిల్మ్తోనే ఎంతో గొప్ప పేరు సాధించాడు. ఇప్పుడు ఉప్పెన-2 ఉండబోతోంది అనే సంకేతాలు ఇస్తున్నాడు డైరెక్టర్ బుచ్చిబాబు.
ఇదీ చదవండి: సన్నీకి చుక్కలు చూపిస్తున్న ప్రియ! ఇదెక్కడి మాస్ రా మావ?
‘ఉప్పెన’ సాధించిన విజయం చూశాక బుచ్చిబాబుపై అందరికీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే బుచ్చిబాబు నుంచి ఉప్పెన-2పై హింట్ రావడంతో అందరిలో ఆసక్తి పెరిగిపోయింది. దానికితోడు పాన్ వరల్డ్ సబ్జెక్ అవుతుంది అంటూ బుచ్చిబాబు హైప్ పెంచేస్తున్నాడు కూడా. ఉప్పెన సినిమాకి ముందే ఉప్పెన2 కథ రాసుకున్నట్లు బుచ్చిబాబు తెలిపాడు. ఈ ప్రపంచంలో మరే వ్యక్తి కూడా అలాంటి కథ రాయలేడంటూ బుచ్చిబాబు స్టేట్మెంట్ పాస్ చేశాడు. ఉప్పెనకు ముందే ఆ కథ రాస్తే దానిని ఎందుకు తెరకెక్కించలేదు అనే విషయంపై ఏ చెప్పలేదు. కానీ సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉంటుందనే విషయాన్ని అయితే చెప్పకనే చెప్పాడు. ఒక విభిన్న కథగా ఉప్పెనను తెరకెక్కించిన బుచ్చిబాబు. ఉప్పెన-2ను ఏ రేంజ్లో ప్లాన్ చేశాడో అని ఇప్పటి నుంచే అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోయింది.