బాలకృష్ణ హోస్ట్ గా ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో అందరికి తెలిసిందే. ఆహాలో స్ట్రీమ్ అవుతున్న అన్ స్టాపబుల్ ఇప్పుడు దేశంలోనే టాప్ టాక్ షో కావడం నిజంగా గర్వించతగ్గ విషయం. ముఖ్యంగా బాలయ్య అన్ స్టాపబుల్ ఎనర్జీ ఈ షోకి ప్రధాన బలమైంది. హోస్ట్ గా బాలకృష్ణ టైమింగ్ ఓ రేంజ్ లో ఉంది. అయితే.. ఆహా అంటే మెగా కాంపౌండ్ కి చెందిన ఓటీటీ. అల్లు అరవింద్ తలుచుకుంటే ఈ టాక్ షోని మెగాస్టార్ చిరంజీవితో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. కానీ.., అల్లు అరవింద్ బాలయ్యతో ఎందుకు ప్రొసీడ్ అయినట్టు? అన్ స్టాపబుల్ మొదలైన నాటి నుండి ఈ డౌట్ అందరిలోను ఉంది. తాజాగా.. సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రైటర్ బి.వి.యస్ రవి ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. గతంలో పలు విజవంతమైన సినిమాలకి రచయతగా పని చేసిన బి.వి.యస్ రవి అన్ స్టాపబుల్ షోకి రైటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రవి. చిరంజీవిని కాదని బాలకృష్ణతో అన్ స్టాపబుల్ చేయడానికి కారణాలు కూడా చెప్పుకొచ్చాడు.
“అల్లు అరవింద్ అంటే ఓ కాంపౌండ్ కి చెందిన వ్యక్తి కాదు. ఆయనకి ఒక వ్యాపకం కాదు. అందరితో బాగుంటారు. అన్నీ పనులను చేసుకుంటూ ఉంటారు. అక్కినేని కుటుంబంతో ఆయన చాలా సినిమాలను తెరకెక్కించారు. నందమూరి కుటుంబంతో వారిది 40 ఏళ్ళ అనుబంధం. పైగా.. మన హీరోల మధ్య పోటీ ఉన్నా, అది వ్యక్తిగతం కాదు. ఈ విషయంలో మన హీరోలు చాలా క్లారిటీగా ఉంటారు. కొత్త టాక్ షోకి బాలకృష్ణ లాంటి హీరో హోస్ట్ గా చేస్తే ఆ ఫ్లేవర్ వెరైటీగా ఉంటుందని మేకర్స్ భావించి ఉండొచ్చు. ఆహాలో మేజర్ పార్ట్ అరవింద్ గారిదే అయినా.. నిర్ణయం ఆయన ఒక్కడే అవ్వదు కదా? అయినా.. అన్ స్టాపబుల్ షో మొదలవ్వకముందే చిరంజీవి గారికి మొత్తం తెలుసు. అన్ స్టాపబుల్ కి వచ్చే గెస్ట్ ల లిస్ట్ కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. మమ్మల్ని విష్ కూడా చేశారు. క్రియేటివ్ చూజింగ్ లో భాగంగానే అన్ స్టాపబుల్ బాలయ్యతో ప్లాన్ చేశారని” రచయత బి.వి.యస్ రవి తెలియచేశాడు. ప్రస్తుతం.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. అన్ స్టాపబుల్ షో చిరంజీవితో కాకుండా బాలకృష్ణతో చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.