తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో హిట్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన దిల్ రాజు గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ‘దిల్’చిత్రంతో నిర్మాతగా మారిన ఆయన ఆ సినిమా పేరునే ఇంటిపేరు గా మార్చుకున్నారు. తేజస్విని ద్వితీయ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తేజస్విని ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. మొదటి సారిగా తన కొడుకుతో సహా కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు.
దిల్ రాజు మొదటి భార్య అనితకు ఓ కూతురు ఉంది.. ఆమె పేరు హన్షిత. దిల్ రాజజు నిర్మించే సినిమాల నిర్మాణ పనులను వ్యవహరిస్తూనే తెలుగు డిజిటల్ మాధమ్యం ఆహాలో భాగస్వామిగా కూడా బాధ్యతలను నిర్వహిస్తూ వస్తున్నారు. కాగా, డిసెంబర్ 10, 2020.. నిర్మాత దిల్రాజు , తేజస్వినిల వివాహం నిజామాబాద్లోని ఫామ్ హౌస్లో పరిమిత సంఖ్యలోని అతిథులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో వివాహం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. వీరికి 2022 జూన్ 29న మగబిడ్డ జన్మించాడు.
దిల్ రాజు ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం RC 15ను రూపొందిస్తున్నారు. వీటి తో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ పైప్ లైన్లో ఉన్నాయి. దిల్ రాజు మొదటి సారిగా తన కొడుకుతో సహా కుటుంబ సమేతంగా తిరుమల దర్శనం చేసుకున్న దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.