టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన దిల్ రాజు ప్రస్తుతం జీవితంలోని కొన్ని మధుర క్షణాలను ఆశ్వాదిస్తున్నారు. గత బుధవారం ఆయన సతీమణి తెజస్విని మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో తన కుమారుడిని ఎత్తుకుని మురిసిపోతున్న దిల్ రాజు ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. చాలా విలువైన క్షణాలు అంటూ దిల్ రాజు ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఈ ఫొటోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం దళపతి విజయ్తో ‘వారసుడు’ అనే సినిమా తీసే సమయంలో దిల్ రాజుకు.. వారసుడు వచ్చాడు అంటూ ఫ్యాన్స్ సంబర పడిపోతున్నారు.
డిసెంబర్ 10, 2020లో నిజామాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో దిల్ రాజు, తేజస్వినిల వివాహం జరిగింది. ఈ వివాహానికి చాలా పరిమితమైన అతిథులను మాత్రమే ఆహ్వానించారు. దిల్ రాజుకు ఇది రెండో వివాహం. ఆయన మొదటి భార్య అనిత 2017లో గుండెపోటుతో కాలం చేశారు. వారికి హన్షిత అనే కుమార్తె ఉంది. ఆమె ప్రస్తుతం దిల్ రాజు నిర్మిస్తున్న కొన్ని సినిమాల నిర్మాణ బాధ్యతలు చూస్తూనే ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో కూడా భాగస్వామిగా ఉన్నారు.
ఇంక సినిమాల విషయానికి వస్తే.. దిల్ రాజు ప్రస్తుతం అన్నీ భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్- శంకర్ తో కలిసి RC15 తెరకెక్కిస్తున్నారు. మరోవైపు దళపతి విజయ్ హీరోగా వారసుడు సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. నాగచైతన్యతో థాంక్యూ సినిమా నిర్మిస్తున్నారు. దిల్ రాజు వైరల్ ఫొటోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.