సినిమా పరిశ్రమలో ఒక్కరు క్లిక్ అయితే చాలు.. వారి నుండి వారసులు పుట్టుకు రావడం పరిపాటే. ఇది ఇప్పుడే కాదూ.. గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతుంది. తొలి నాళ్లలో హీరోల సోదరులు, పిల్లలు చలన చిత్ర పరిశ్రమలో ఏదో ఒక క్రాప్ట్లో పని చేసేవారు.
సినిమా పరిశ్రమలో ఒక్కరు క్లిక్ అయితే చాలు.. వారి నుండి వారసులు పుట్టుకు రావడం పరిపాటే. ఇది ఇప్పుడే కాదూ.. గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతుంది. తొలి నాళ్లలో హీరోల సోదరులు, పిల్లలు చలన చిత్ర పరిశ్రమలో ఏదో ఒక క్రాఫ్ట్ లో పని చేసేవారు. ఆ తర్వాత హీరోయిన్ల వారసత్వం మొదలైంది. అలా ఎంట్రీ ఇచ్చారు సహజ నటి జయసుధ. అప్పటి టాలీవుడ్ టాప్ హీరోయిన్, ప్రముఖ దర్శకురాలు దివంగత విజయ నిర్మల వారసురాలిగా ఆమె మేనకోడలు జయసుధ సినీ రంగ ప్రవేశం చేసింది. పండంటి కాపురంతో ఆమెను పరిచయం చేసింది విజయ నిర్మల. జయసుధ అనేక సినిమాల్లో చేసి మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పటికీ సినీ రంగంలో కొనసాగుతూనే ఉంది.
అలాగే జయసుధ సోదరి సుభాషిణి కూడా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఎన్టీఆర్, నాగేశ్వరరావు, రజనీకాంత్, చిరంజీవి వంటి స్టార్ నటీనటుల సినిమాల్లో కనిపించింది. అనేక సినిమాల్లో హీరోయిన్గా రాణించింది. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అక్క జయసుధతో కూడా పలు సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే అక్కతో పోల్చుకుంటే సుభాషిణికి సినిమా అవకాశాలు తక్కువనే చెప్పాలి. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది సుభాషిణి. బావను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ చేశారు. ఆ తర్వాత కూడా అరుంధతి, సీతయ్య వంటి సినిమాల్లో పవర్ ఫుల్ పాత్రలో మెప్పించారు. ఈ తరానికి కూడా ఆమె నట విశ్వరూపాన్ని చూపించారు. అయితే ఆ తర్వాత విలన్ పాత్రలే రావడంతో సినిమాలు తగ్గించేశారు.
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ వందకు పైగా సినిమాల్లో నటించారు సుభాషిణి. ఆ తర్వాత ఆమె బుల్లితెరపై కూడా మెరిశారు. నాగాస్త్రం, సుందరాకాండ మొదలైన టి.వి.సీరియళ్లలో కూడా కనిపించింది. తర్వాత బుల్లి తెరపై కనుమరుగైంది. ఆమె కుమార్తెను కూడా సినిమాలోకి తీసుకువచ్చారు సుభాషిణి. సుభాషిణి కుమార్తె పేరు పూజ. ఆమె పూరీ జగన్నాథ్ సినిమా 143లో సెకండ్ హీరోయిన్గా నటించింది. పూరీ జగన్నాథ్ తమ్మడు సాయి రామ్ శంకర్ హీరో, సమీక్ష హీరోయిన్. ఆ సినిమాలో హీరో సాయిని వన్ సైడ్ లవ్ చేస్తూ కనిపిస్తుంది. అయితే ఈ సినిమా హిట్ కాకపోవడంతో మళ్లీ పూజ ఏ సినిమాలోనూ కనిపించలేదు. 2012లో పూజ ప్రియాంకకు ఆకెళ్ల చంద్ర శేఖర్ అనే వ్యక్తితో వివాహం జరిగింది.