తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్వయంకృషి కి మారు పేరు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు వచ్చే ప్రతి యంగ్ స్టార్.. తమకి చిరంజీవి ఆదర్శమని చెప్పడం మనమంతా చూస్తూనే ఉన్నాం. ఇందుకే.. తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి అంటే ఓ శిఖరం. అలాంటి శిఖరాన్ని చూసి మొరిగే జంతువులు ఇండస్ట్రీలో ఉన్నారంటే అతిశయోక్తి లేదు. వారంతా కులం పేరుతోనో, రాజకీయం పేరుతోనో చిరంజీవిని రోడ్డు మీదకు లాగేయాలని ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నారు. దీనికి తాజాగా జరిగిన ‘మా’ ఎన్నికలు మరోసారి వేదిక అయ్యింది.
‘మా’ ఎన్నికల విషయంలో మెగాస్టార్ ని బ్లేమ్ చేయడానికి పలువురు పనికట్టుకొని ప్రయత్నించారు. ప్రకాష్ రాజ్ కి చిరంజీవి సపోర్ట్ అంటూ నానా యాగీ చేశారు. నాగబాబు ప్రకాశ్ రాజ్ కి తాను మద్దతు ఇస్తున్నట్టు చెబితే, దానర్ధం ప్రకాష్ రాజ్ కి చిరంజీవి మద్దతిచ్చినట్లు కాదు కదా?
వాస్తవానికి చిరంజీవి ఇండస్ట్రీలో అందరినీ సమానంగా చూస్తుంటారు.. అందరికీ తన ఆశీస్సులు అందిస్తుంటారు. చిన్న ఈవెంట్స్ కి వెళ్లి.. దర్శక, నిర్మాతలకు, హీరోలకు కూడా తన ప్రోత్సాహాన్ని అందిస్తుంటారు. అలాంటి మెగాస్టార్ ఈ మా ఎన్నికల్లో ఒక్క స్టాండ్ ఎలా తీసుకుంటారు? ఇవన్నీ తెలిసి కూడా కొంతమంది మా ఎన్నికల విషయంలో మెగాస్టార్ ని బయటకు లాగాలని ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో మా ఎన్నికలు జరిగిన విధానాన్ని ఒక్కసారి అందరూ గుర్తుంచుకోవాలి.
‘మా” ఎన్నికలు ఏకగ్రీవం అవ్వాలనే దిశగా చిరంజీవి ఆలోచనలు సాగాయి. ఎన్నికలు ఏకగ్రీవమైతే పరిశ్రమలో గొడవలుండవనేది ఆయన ఆలోచన. అందుకే విష్ణుని తప్పుకోమని కోరారు. అంతేతప్ప.. ప్రకాశ్ రాజ్ కి అధికారం కట్టబెట్టాలి అన్నది చిరంజీవి ఆలోచన కాదు. నిజంగా ప్రకాశ్ రాజ్ ని గెలిపించుకోవడమే చిరంజీవి ఆలోచన అయితే.. ఆయన మీడియా ముందుకు వచ్చి ఒక్క ప్రెస్ మీట్ పెడితే సరిపోదా? లెక్కలు అన్నీ నిమిషాల్లో మారిపోయేవి కదా? కానీ.., చిరు ఆ పని చేయలేదు. విష్ణు ఎన్నికల్లో నిలబడటం ఖాయం అని తెలిశాక మెగాస్టార్ మౌనంగానే ఉండి పోయారు. ఎక్కడా, ఎవ్వరికీ ప్రచారం చేయలేదు. మరి.. ఇక్కడ చిరంజీవి మంచి హృదయం అర్థం కావడం లేదా?
ఇంత జరిగినా.. విష్ణు మాత్రం చిరంజీవి అంకుల్ మా కుటుంబ సభ్యుడే అని చెప్తూ వచ్చాడు. అంతే కాదు బాలకృష్ణను కలిసిని విష్ణు తర్వాత చిరంజీవి అంకుల్ ని కూడా కలుస్తానని బహిరంగానే చెప్పారు. అంటే మా ఎన్నికల విషయంలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణులను చిరంజీవి సమాన దృష్టితోనే చూసినట్టే కదా?
చిరంజీవి చేసిన ఇంత మంచి ఆలోచనని వదిలేసి.. “రెండేళ్ల పాటు ఉండే ఓ పదవి కోసం ఎలాంటి అధికారాలు, హోదా లేని పదవుల కోసం ఎందుకు ఈ ఆర్భాటాలు.. ఎందుకు ఈ రగడ అన్నారని కొంతమంది చిరంజీవిని బదనాం చేయాలని చూశారు. కానీ.. ఆయన పరితపించింది మాత్రం జయాపజయాలకి కాదు. ‘మా’ పరువుని కాపాడటం కోసం.
ఎవరికి నచ్చినట్టు వారు ఎన్నికలకి వెళ్లారు. అక్కడ అసాంఘిక శక్తులు అన్నీ కలసి ‘మా’ ఎన్నికలను చండాలంగా మార్చేశాయి. ‘మా’ పరువును బజారుకి ఈడ్చేశాయి. ఇప్పుడు అందరిలో చీప్ అయ్యాక, జరగాల్సిన నష్టం జరిగిపోయాక, డ్యామేజీ కంట్రోల్ చర్యలు మొదలెట్టారు.
మంచు విష్ణు విజయం తర్వాత అందరికీ తెలిసొచ్చిన విషయం ఏంటేంటే.. మెగాస్టార్ చిరంజీవి ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని. ఆయన అందరి మంచి కోరే వ్యక్తి అని గుర్తించారు. ఈ విషయం వారికి ఇప్పుడు జ్ఞానోదయం అయినట్లు తెలుస్తుంది. దీంతో.. ఇప్పుడు చిరంజీవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తప్పయిపోయింది మహాప్రభో.. అంటూ కాళ్లా, వేళ్లా పడుతున్నారు. ఇలా మెగాస్టార్ చిరంజీవికి సంబంధం లేని విషయాలు ఆయనకు అంటగట్టి పైశాచికానందం పొందాలనుకున్నవాళ్లకి ఇప్పుడు మైండ్ బ్లాంక్ అయిపోయింది. మెగాస్టార్ అంటే అందరివాడు.. అందుకే ఇప్పుడు గాడి తప్పిన ‘మా’ కి ఆయన అనుభవం అవసరం అయ్యింది. ఇండస్ట్రీలో లోటుపాట్లు సరిదిద్దాల్సిన బాధ్యత చిరంజీవి మీదే పడింది. ఆ సత్తా, తన మన అనే బేధాలు చూడని విశాల హృదయం చిరంజీవి సొంతం కాబట్టి.. ఆయన వద్దకే ఇప్పుడు అంతా క్యూ కడుతున్నారు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.