క్యాస్టింగ్ కౌచ్ అనేది సినీ పరిశ్రమలో ఉందని ఇప్పటికే పలువురు హీరోయిన్లు, నటీమణులు వెల్లడించారు. తాజాగా ఓ నిర్మాతపై హీరోయిన్లు ఆరోపణలు చేశారు. ఆ నిర్మాత అవసరం తీరిన తర్వాత ముఖం చాటేస్తాడంటూ ముగ్గురు నటీమణులు వెల్లడించారు.
సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అన్న పదం ఎప్పటి నుంచే వినిపిస్తుంది. మీటూ పేరుతో చాలా మంది హీరోయిన్లు, నటీమణులు, సింగర్లు వంటి వారు ముందుకొచ్చి క్యాస్టింగ్ కౌచ్ బాధితులమంటూ వెల్లడించారు. క్యాస్టింగ్ కౌచ్ అనేది ప్రపంచమంతా ఉంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అని తేడా లేకుండా ప్రతీ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ క్యాస్టింగ్ కౌచ్ ఉందని పలువురు సెలబ్రిటీలు మీడియా ముఖంగా వెల్లడించారు. తాజాగా క్యాస్టింగ్ కౌచ్ పై ముగ్గురు హీరోయిన్స్ స్పందించారు. ప్రేమమ్ సినిమాలో నటించిన ప్రకృతి మిశ్రా అనే హీరోయిన్ ఓ నిర్మాతపై తీవ్ర ఆరోపణలు చేయగా ఆమెకు ఇద్దరు హీరోయిన్లు మద్దతుగా నిలిచారు.
ఒడియా ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన నిర్మాత సంజయ్ నాయక్ పై హీరోయిన్ ప్రకృతి చేసిన ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపాయి. సినిమాల్లో అవకాశాలు ఇస్తానని సంజయ్ నాయక్ అనే నిర్మాత ఎంతో మంది యువతులను లోబర్చుకున్నాడని.. అవసరం తీరిన తర్వాత ముఖం చాటేస్తున్నాడని ఆరోపించారు. అయితే ప్రకృతి మిశ్రా వ్యాఖ్యలకు హీరోయిన్ పుపుల్ భుయాన్, సీరియల్ నటి జాస్మిన్ రథ్ మద్దతు పలికారు. ఒడియా సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని, నిర్మాత సంజయ్ నాయక్ పై వస్తున్న ఆరోపణలు నిజమే అని నటి పుపుల్ భుయాన్ అన్నారు. ఓటీవీ అనే ఒడియా ఛానల్ తో ఆమె మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో 99 శాతం మంది మంచి వాళ్ళే ఉన్నారని, ఒక్క శాతం సినీ ప్రముఖులు మాత్రం కొత్తగా వచ్చే హీరోయిన్స్ ని వాడుకుంటారని అన్నారు.
సినిమాల్లో అవకాశాలు రావాలంటే కాంప్రమైజ్ అవ్వాలని బలవంతం చేస్తారని ఆమె అన్నారు. ఓలీవుడ్ ఇండస్ట్రీలో అనేక మంది ప్రతిభ గల అమ్మాయిలు ఉన్నారని.. కానీ రెండు, మూడు సినిమాలు చేశాక కనబడకుండా పోతున్నారని అన్నారు. దీని బట్టి ఇండస్ట్రీలో ప్రతిభ కంటే కాంప్రమైజ్ అయితేనే నిలబడగలుగుతారని ఆమె అన్నారు. ఎవరైతే కాంప్రమైజ్ అవ్వడానికి ఇష్టపడరో వాళ్ళు సడన్ గా ఇండస్ట్రీలో కనుమరుగవుతారని ప్రకృతి మిశ్రా మీడియాతో వెల్లడించారు. తనకు కూడా క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైందని.. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో కాంప్రమైజ్ అవ్వమని బలవంతం చేశారని.. కానీ నిరాకరించినట్లు ఆమె వెల్లడించారు.
అక్కడ నుంచి వచ్చేసి రియాలిటీ షోల ద్వారా ప్రూవ్ చేసుకున్నానని.. ఇండస్ట్రీలో ఉన్న మంచి వ్యక్తులను కలిసి నటిగా నిరూపించుకుని నిలబడ్డానని అన్నారు. ఇప్పుడు తాను ఒక మంచి స్థానంలో ఉన్నానని.. కాబట్టి ఎవరూ తనను కాంప్రమైజ్ అవ్వమని నా దగ్గరకు రారు అంటూ ఆమె వెల్లడించింది. అయితే సంజయ్ నాయక్ మాత్రం తనపై వస్తున్న ఆరోపణలు నిజం కాదని.. కావాలని తన ఇమేజ్ ని నాశనం చేయడానికి చేస్తున్న కుట్ర అని అంటున్నారు.