అందరు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ‘ఆదిపురుష్’ చిత్రం శుక్రవారం మన ముందుకు రానుంది. రాముడి పాత్రలో ప్రభాస్.. జానకి పాత్రలో కృతి సనన్ నటించింది. ఓం రౌత్ ఈ చిత్రాన్ని రూపొందించాడు.
ప్రస్తుతం అందరి నోట్లో ‘ఆదిపురుష్’ సినిమా పేరే నానుతుంది. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఆదిపురుష్’ సినిమా రేపు మన ముందుకు రానుంది. ఇందులో రామునిగా ప్రభాస్, సీత పాత్రలో బాలీవుడ్ స్టార్ కృతి సనన్ నటించారు. కృతి సనన్ ‘వన్ నేనొక్కడినే’ అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమయమైంది. తర్వాత పలు మూవీలు చేసి.. బాలీవుడ్లోకి అడుగుపెట్టింది హిందీలో జాకీ ష్రోఫ్ కొడుకు టెగర్ ష్రోఫ్తో మొదటి చిత్రం హీరోపంతి. ఈ సినిమా ద్వారా హిందీలో కథానాయికగా అడుగుపెట్టింది. బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. రాబ్తా, షెహ్జాదా, దిల్వాలే, భేడియా మొదలైన చిత్రాల్లో నటించింది. తాజాగా ‘ఆదిపురుష్’ మూవీతో ప్రేక్షకులను అలరించనుంది. శుక్రవారం విడుదలకు సిద్ధంగా ఉన్న ఆదిపురుష్ చిత్రాన్ని దర్శకుడు ఓం రౌత్ రూపొందించాడు. ఈ సందర్బంగా ఓ ఇంటర్వ్యూలో కృతి మాట్లాడుతూ.. తన కో స్టార్ ప్రభాస్ని పొగడ్తలతో ముంచెత్తింది. ప్రభాస్తో పనిచేయడం, ఆదిపురుష్ షుటింగ్లో జరిగిన కొన్ని సంఘటన గురించి ఆమె చెప్పుకొచ్చారు. ఇంతకీ కృతి ఏం చెప్పిందంటే…
ప్రభాస్ చాలా రిజర్డ్వ్ అని విన్నానని, కానీ తనకైతే అలా అనిపించలేదని చెప్పింది. ప్రభాస్ చాలా ప్రశాంతంగా ఉంటారని, ఎదుటి వారిని గౌరవిస్తారని చెప్పింది. తన మొదటి సినిమా గురించి మాట్లాడుతూ తనతో మాట్లాడడం స్టార్ట్ చేశాడని చెప్పింది. తన పని తాను సైలెంట్గా చేసుకుంటూ పోతాడని.. కళ్లతోనే తన భావాలను వ్యక్తపరుస్తాడని చెప్పింది. ‘ఆదిపురుష్’ మూవీలో రాఘవుడి ప్లేస్లో ప్రభాస్ను తప్ప మరొకరిని ఊహించలేనని అన్నది. ప్రభాస్తో కృతి సీక్రెట్ ఎఫైర్ నడుపుతోందనే టాక్ వచ్చింది. ప్రభాస్తో ఆదిపురుష్లో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసింది. సరదాగా ఆదిపురుష్ మూవీతో ఒకరికొకరు సహకరించుకుంటూ కంప్లీట్ చేశారు. ప్రస్తుతం కృతి సనన్, ప్రభాస్ ప్రేమలో పడ్డారని, డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు పుట్టుకొస్తున్నాయని తెలిపింది. సోషల్ మీడియాలో రూమర్స్పై స్పందించిన కృతి సనన్ ప్రభాస్,తను మంచి స్నేహితులం మాత్రమే అని అంతకుమించి ఏమీ లేదని క్లారిఫికేషన్ ఇచ్చింది.