ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో, ఎలా ట్రెండింగ్ లోకి వస్తుందో అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేం. ఎందుకంటే ఇది సోషల్ మీడియా యుగం కాబట్టి. అలా ఈ మధ్య కాలంలో ఓ మూడు పాటలు బాగా పాపులర్ అయ్యాయి. ఇన్ స్టా ఓపెన్ చేస్తే చాలు.. అన్ని పేజీల్లో పోస్టులు, రీల్స్ లో కూడా అవే కనిపిస్తున్నాయి. ఇక నెటిజన్స్ వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇక ఇన్ స్టా ఇన్ఫ్లూయెన్సర్లు మాత్రం వాటికి రీల్స్ చేస్తూ చెలరేగిపోతున్నారు. తాజాగా అషూరెడ్డి చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘జబర్దస్త్’, ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ తర్వాత ఆ రేంజ్ లో ఫేమ్ తెచ్చుకున్న షో అంటే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’నే. ఇందులో కమెడియన్లతో యాంకర్లు, టీవీ నటులు.. ఒకరేమిటి అందరూ కనిపిస్తుంటారు. అందుకు తగ్గట్లే ఎంటర్ టైన్ మెంట్ ఇస్తూ ఉంటారు. అలా తాజాగా జరిగిన ఎపిసోడ్ లో నటి భాను, ‘తీన్ మార్’ సినిమాలోని ‘గెలుపు తలుపులే’ సాంగ్ పాడింది. ఇక ఆమె పాడిన తర్వాత జడ్జి ఇంద్రజ.. ‘పాటలో డెప్త్ కనపడుతుంది’ అని చెప్పింది. దీంతో ఈ విషయాన్ని మీమర్స్ పట్టేశారు.
అప్పటినుంచి భానుపై మొదలైన ట్రోలింగ్.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఓ వారం నుంచి భాను పాటపై పేరడీలు క్రియేట్ చేస్తున్న మీమర్స్.. నెటిజన్స్ కు ఫుల్ ఫన్ అందిస్తున్నారు. ఇదంతా పక్కనబెడితే ఇన్ స్టా ద్వారా ఫేమ్ తెచ్చుకున్న అషూరెడ్డి.. ఈ మధ్య కాలంలో హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ కుర్రాళ్లని కుదురుగా కూర్చోనివ్వకుండా చేస్తోంది. ఇప్పుడు తాజాగా భాను పాటని రీల్ గా చేసింది. దీన్ని చూస్తుంటే భానుని ఫన్నీగా ట్రోల్ చేసినట్లు కనిపిస్తోంది. అషూతో పాటు మరో ముగ్గురు ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోలో కనిపించి ఫన్ జనరేట్ చేశారు. మరీ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్టు చేయండి.