సాధారణంగా ఏ చిత్ర పరిశ్రమలోనైన హీరోలు ఓ స్థాయికి వచ్చాక కథల ఎంపికలో.. ఓ నూతన ఒరవడిని సృష్టిస్తారు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఇదే జరుగుతోంది. మూస పద్దతికి చరమగీతం పాడిన డైరెక్టర్లు, హీరోలు కొత్త కొత్త కథలతో అభిమానులను అలరిస్తున్నారు. ఇప్పుడు ఇదే పంథాను ఎన్నుకున్నట్లు కనిపిస్తున్నాడు హీరో అల్లరి నరేష్. గత ఏడాది ‘నాంది’ సినిమాతో ఘన విజయాన్ని అందుకున్న ఈ అల్లరి హీరో.. మరో సారి విభిన్నకథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అల్లరి నరేష్ హీరోగా ఏఆర్ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైద్రాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. ఈ వేడుకలో అల్లరి నరేష్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘నాంది’ మూవీతో గతేడాది బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు హీరో అల్లరి నరేష్. దాంతో తన కథల ఎంపికలో సైతం కొత్త దనం చూపిస్తూ వస్తున్నాడు. తాజాగా మరో పొలిటికల్ గేమ్ తో ఈ నెల 25 ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. డైరెక్టర్ ఏఆర్ మోహన్ దర్శకత్వలో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. త్వరలో రిలీజ్ కానుండటంతో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైద్రాబాద్ లో నిర్వహించింది. ఈ వేడుకలో హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ..”నాంది సినిమాకు పనిచేసిన సగం మంది టెక్నీషియన్లే ఈ చిత్రానికి కూడా పనిచేశారు. ముఖ్యంగా ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి చాలా కష్టపడ్డారు. ఈ సినిమా ఎక్కువగా అడవి చుట్టూనే తిరుగుతుంది. దానికి తగ్గట్లు అద్బుతంగా సెట్స్ వేశారు బ్రహ్మకడలి” అని చెప్పుకొచ్చాడు.
”ఇకకెమెరామెన్ రాంరెడ్డి నన్నుబాగా చూపించాడు. దాంతో చాలా మంది ఈ సినిమాలో అందంగా ఉన్నావంటూ అంటున్నారు. అందరూ గతంలో చాలా బాగా నటించావ్ అంటే.. ఇప్పుడు మాత్రం చాలా అందంగా ఉన్నవ్ అంటున్నారు. అలా అంటుంటే నాకు సిగ్గేస్తోంది” అని చెప్తూ అల్లరి నరేష్ నవ్వులు పూయించారు. ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల గొప్ప సంగీతాన్ని అందించాడని నరేష్ ప్రశంసించాడు. ఈ సినిమా హిట్ అయితే త్వరలోనే మోహనే అన్ని భాషల్లో దీన్ని తెరకెక్కించాలని కోరుకుంటున్నట్లు అల్లరి నరేష్ పేర్కొన్నాడు. ఇక ఈ ఈవెంట్ కు హీరో శ్రీవిష్ణు, డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి తదితరులు పాల్గొన్నారు.