మలయాళ సినీ పరిశ్రమకు చెందిన ఐశ్వర్య లక్ష్మి.. మలయాళ, తమిళ, తెలుగు భాషల్లో పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో గాడ్సే సినిమాలో నటించిన ఈ బ్యూటీ.. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ 1లో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి పెర్ఫార్మెన్స్, ఒలకబోసిన గ్లామర్ కి జనాలు మెంటలెక్కిపోయారు. వరుస హిట్స్ తో ప్రస్తుతం జోష్ లో ఉన్న ఈ బ్యూటీ.. మరోసారి సాలిడ్ హిట్ అందుకుంది. తమిళంలో తెరకెక్కిన గట్ట కుస్తీ, తెలుగులో మట్టి కుస్తీ పేరుతో డిసెంబర్ 2న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో మట్టి కుస్తీ మూవీ యూనిట్ ఫుల్ ఖుషీగా ఉంది.
ప్రమోషన్ లో భాగంగా మీడియాతో కాసేపు ముచ్చటించారు. ఈ క్రమంలో మీడియా పర్సన్ ఆసక్తికర ప్రశ్నను హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి ముందు ఉంచగా.. ఆమె విభిన్నంగా సమాధానమిచ్చింది. పెళ్లి మీద మీ అభిప్రాయం ఏంటి అని అడుగగా.. పెళ్లి చేసుకునే ఆలోచన లేదని వెల్లడించింది. పెళ్లి చేసుకునే అవసరం లేదని తనకి అనిపిస్తుందని తెలిపింది. తనకు కావాల్సింది భర్త కాదని, పార్ట్నర్ ని కోరుకుంటున్నానని వెల్లడించింది. సహజీవనం చేయడానికి తనకేమీ అభ్యంతరం లేదని.. పెళ్లి చేసుకుంటే కోర్టుల చుట్టూ తిరగాలి.. కట్నం సమస్యలవీ ఉంటాయని, అందుకే తాను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.