చిత్ర పరిశ్రమలో టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు హీరో అడవి శేషు. వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. ఆయన తాజాగా, తన ట్విటర్ ఖాతాలో పెట్టిన ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
తెలుగు చిత్ర పరిశ్రమలోని మోస్ట్ హ్యాండ్సమ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో అడవి శేషు ఒకరు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ, బిజీగా ఉన్నారాయన. ఆయన హీరోగా నటిస్తున్న గూఢాచారి 2 శరావేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా గతంలో వచ్చిన గూఢాచారికి సీక్వెల్గా తెరకెక్కుతోంది. ఇక, అసలు విషయానికి వస్తే.. అడవి శేషు తన ట్విటర్ ఖాతాలో పెట్టిన ఓ పోస్టు సోషల్ మీడియాలోనే కాదు.. చిత్ర పరిశ్రమలో కూడా కలకలం సృష్టిస్తోంది. సోమవారం ఆయన తన ట్విటర్ ఖాతాలో‘‘ వచ్చిన దారినే చూస్కోకపోతే.. ముందున్న దారిని ఎలా సరిదిద్దుకుంటాం’’ అని పోస్టు పెట్టారు. అడవి శేషు ఈ పోస్టు ఎవరిని ఉద్దేశించి పెట్టారన్నది చర్చనీయాంశంగా మారింది.
ఈ పోస్టుపై ప్రముఖ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ స్పందిస్తూ.. ‘‘ అడవి శేషు ఏం చెబుతున్నాడు వెన్నెల కిశోర్.. ఏదో క్రిప్టిక్గా ఉందే.. కొంపతీసి మన గురించా ఏంటి?..’’ అని అన్నాడు. దర్శకుడు సాయి రాజేష్ ఈ పోస్టుపై ఫన్నీగా స్పందించారు. ‘‘ ఈ పోస్టు కిశోర్ అన్న గురించే.. వాళ్ల ఇంటి ముందు రోడ్డు వేస్తున్నారు’’ అని అన్నాడు. అయితే, ఈ పోస్టు ఎవరిని ఉద్దేశించి పెట్టాడో అంతుచిక్కని విషయం. నేరుగా అడవి శేషు స్పందిస్తే తప్ప అసలు నిజం తెలీదు.
కాగా, అడవి శేషు 2002లో వచ్చిన సొంతం సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తర్వాత 8 ఏళ్ల పాటు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నారు. 2010లో కర్మ సినిమాతో హీరోగా.. దర్శకుడిగా రీఎంట్రీ ఇచ్చారు. ఇక అప్పటినుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ సినిమాలు చేస్తూనే.. మరో వైపు హీరోగా కూడా సినిమాలు చేస్తున్నారు. క్షణం సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ను సొంతం చేసుకున్నారు. మరి, అడవి శేషు పెట్టిన పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Occhina daari ne chooskokapothe, mundhunna daarini ela sarididdhukuntaam?
— Adivi Sesh (@AdiviSesh) May 29, 2023