ఆదిపురుష్ సినిమా రెండు రోజుల్లోనే 240 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. మూడవ రోజు ఆదివారం కావటంతో మంచి కలెక్షన్లు వచ్చాయి. దేశం వ్యాప్తంగా ఈ సినిమా..
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడి పాత్రలో నటించిన ‘ఆదిపురుష్’ సినిమా ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికి కలెక్షన్ల పరంగా పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ సినిమా మొదటి రోజు 137 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా భారీ వసూళ్లను కొల్లగొట్టింది. ఏపీ, తెలంగాణల్లో 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక, రెండో రోజు కూడా ఆదిపురుష్కు మంచి వసూళ్లు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక, మూడవ రోజు ఆదివారం కావటంతో కలెక్షన్ల విషయంలో ఆదిపురుష్ కాస్త మెరుగుపడింది.
ఒక్క హిందీ బెల్ట్లో 40 కోట్ల రూపాయలు సాధించింది. ఇక, దేశ వ్యాప్తంగా 70 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఇక, ప్రపంచ వ్యాప్తంగా ఆదిపురుష్ మూడవరోజు కలెక్షన్లు రెండో రోజు కలెక్షన్లను దాటిపోయాయి. ఈ సినిమా 110 కోట్ల రూపాయల కలెక్షన్లను కొల్లగొట్టింది. మూడురోజుల్లోనే 350 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ సినిమా 5 రోజుల్లో 500 కోట్ల మార్కును చేరుకునే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. కాగా, ఆదిపురుష్ సినిమా దాదాపు 600-700 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కినట్లు తెలుస్తోంది.
హిందీ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆదినుంచి వివాదాల్లో చిక్కుకుంటూ వస్తోంది. పాత్రల విషయంలో మార్పులు ఉండటాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. దానికి తోడు ట్రైలర్ కార్టూన్లా ఉండటంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ మొదలయ్యాయి. దీంతో చిత్ర బృందం గ్రాఫిక్స్ విషయంలో పునరాలోచన చేసుకుంది. రీ ఎడిట్కు వెళ్లింది. ఈ నేపథ్యంలో మంచి అవుట్ పుట్ వచ్చింది. అయినప్పటికి సినిమా ప్రేక్షకులను ఆశించినంతగా ఆకట్టు కోలేకపోయింది.