గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. సినీ తారలు.. వారి బంధువులు కన్నుమూయడంతో వారి కుటుంబాల్లో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.
ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సినీ నటులు.. దర్శక, నిర్మాతలే కాదు వారి బంధువులు కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు.. అభిమానులు సైతం శోక సంద్రంలో మునిగిపోతున్నారు. తమిళ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ వనితా విజయ్ కుమార్ మాజీ భర్త.. విజువల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్ పీటర్ పాల్ కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..
ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కూతురు వనితా విజయ్ కుమార్ గురించి తెలియని వారు ఉండరు. 1995లో తమిళంలో విడుదలైన ‘చంద్రలేఖ’ చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వనితా తెలుగు లో కోడీ రామకృష్ణ దర్శకత్వంలో ‘దేవీ’ చిత్రంలో నటించింది. ఈ చిత్రంతో వనితకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఆమె ఆ మద్య బిగ్ బాస్ లో కూడా సందడి చేసింది. వనిత మాజీ భర్త పీటర్ పాల్ కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఈ సందర్భంగా వనితా విజయ్ కుమార్ సోషల్ మీడియాలో ఏమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.
సినీ ఇండస్ట్రీలో విజువల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్ గా పనిచేసే పీటర్ పాల్ కి ఓ మూవీ స్ట్ర్కిప్ట్ నేరేట్ చేసే సమయంలో వనితా అతని ప్రేమలో పడింది. తర్వాత 2020 జూన్ 27న వనితా విజయ్ కుమార్, పీటర్ పాల్ కి వివాహం జరిగింది. కానీ వీరి వివాహం బంధం ఎక్కువ కాలం నిలవలేదు. నాలుగు నెలల తర్వాత ఇద్దరూ విడిపోయారు. పీటర్ తనతో తప్పుగా ప్రవర్తిస్తున్నాడని వనిత 2020 అక్టోబర్ లో విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి పీటర్ మద్యానికి బానిస అయినట్లు అతని సన్నిహితులు తెలిపారు. తన మాజీ భర్త మృతిపై వనిత ‘సుదీర్థ పోరాటం తర్వాత మీకు విముక్తి, శాంతి లభించింది.. ఈ లోకం నుంచి వెళ్లిపోయినందుకు బాధగా ఉంది.. మీకు ఇప్పటికైనా ప్రశాంతత లభిస్తుంది.. ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండండి ’ అంటూ ఎమోషనల్ ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చింది. ఈ పోస్ట్ పై సినీ సెలబ్రెటీలు స్పందిస్తూ పీటర్ పాల్ కి నివాళులు అర్పిస్తున్నారు.