హీరోయిన్ త్రిష.. స్టార్ హీరోయిన్ గా గత దశాబ్దన్నర కాలంగా సౌత్ సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. తన అందంతో, నటనతో సినిమా పరిశ్రమలో తనకుంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాందించుకుంది ఈ చెన్నై సోయగం. ఇప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా కెరీర్ ని లీడ్ చేస్తోంది. తాజాగా త్రిష స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ పొన్నియిన్ సెల్వన్ సినిమాలో కుందవైగా అద్బుతంగా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ అమ్మడు తన రెమ్యూనరేషన్ కూడా పెంచింది అన్న వార్తలు కూడా వచ్చాయి. తాజాగా మరోసారి ఈ అమ్మడు వార్తల్లో నిలిచింది. చెన్నైలో ఖరీదైన ఇంటిని త్రిష కొనుగోలు చేసిందని అక్కడి వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
త్రిష.. నలబై పదుల వయసు దగ్గర పడుతున్నా గానీ.. ఇరవై సంవత్సరాల అమ్మాయిలా కనిపిస్తూ.. కుర్రాళ్ల గుండెల్ని గాయపరుస్తోంది ఈ చెన్నై సోయగం. యంగ్ హీరోయిన్ లకు దీటుగా సినిమా ఆఫర్లు కొట్టేస్తూ.. ఇండస్ట్రీలో దూసుకెళ్తోంది. పొన్నియిన్ సెల్వన్ తో పాన్ ఇండియా లెవల్లో భారీ విజయాన్ని అందుకుంది త్రిష. ఈ నేపథ్యంలో త్రిషకు సంబంధించిన ఓ వార్త తమిళ పరిశ్రమలో కోడై కూస్తోంది. అదేంటంటే? ఈ అమ్మడు చెన్నైలో ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసిందట. అదీకాక తన ఇష్టానికి అనుగుణంగా ఆ ఇంటిని తీర్చిదిద్దుకుంటుందని తెలుస్తోంది. కోలీవుడ్ ఇండస్ట్రీ సమాచారం ప్రకారం త్రిష ఈ ఇంటిని ఏకంగా రూ. 35 కోట్లు పెట్టి కొనుగోలు చేసిందట. అలాగే తన అభిరుచులకు అనుగుణంగా ఇంటీరియర్ డిజైన్ కూడా చేయించుకుంటోందని వినికిడి.
అయితే గతంలోనే ఈ అమ్మడు హీరో అజిత్ ఇంటి సమీపంలో రూ. 5 కోట్లతో ఓ ఫ్లాట్ ను కొనుగోలు చేసింది. తాజాగా ఇప్పుడు కొన్న ఇల్లు నటుడు విజయ్ ఇంటి సమీపంలోనే కొన్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇక త్రిష లీడ్ రోల్ లో నటించిన రాంకీ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు విజయ్ తో కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారు. ఈ మూవీకి సంబంధించి ఇటీవలే చిత్రీకరణ కూడా ప్రారంభం అయ్యింది. మరి త్రిష ఖరీదైన ఇల్లు కొనడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.