హీరోయిన్ అనగానే..గ్లామర్ షో చేస్తూ.. నాలుగు పాటల్లో హీరో పక్కన కనిపిస్తే చాలనుకునే ఈ కమర్షియల్ రోజుల్లో.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ సాయిపల్లవి. ఆమె రాకతో అప్పటి వరకు హీరోయిన్స్ పై ఉన్న భావాలు ఒక్కసారిగా బ్రేక్ అయ్యాయి. ఇండస్ట్రీలో స్టార్ గా ఎదగాలంటే స్కిన్ షో అవసరం లేదని నిరూపించింది సాయిపల్లవి. ‘ఫిదా’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సాయిపల్లవి.. పక్కఇంటి అమ్మాయిలా కనిపిస్తూ అభిమానుల్లో మంచి గుర్తింపు సంపాదించింది. ఆమెకు హీరోల రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందరు ఇష్టపడే సాయిపల్లవికి ఓ హీరో అంటే చాలా ఇష్టం అంటా! ఆ హీరోను అంతలా ఇష్ట పడటానికి కారణం ఏమిటో కూడా చెప్పింది. తాజాగా క్యాష్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న సాయిపల్లవి.. ఆ విషయాలు వెల్లడించింది.
తెలుగు బుల్లితెరపై సుమ చేసే సందడి అంతాఇంతా ఉండదు. దాదాపు అన్ని షోల్లో, మూవీ ఈవెంట్లు ఇలా ప్రతిచోటా సుమ హంగామా చేస్తోంది. సుమకు హీరోయిన్లకి ఉన్న రేజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. క్యాష్ అనే ప్రోగ్రామ్ లో సుమ యాంకర్ గా చేస్తూ ..ప్రతి వారం అతిధులుగా వచ్చే సెలబ్రిటీలతో కలసి సందడి చేస్తుంది. అలానే ఈ వారం క్యాష్ షో కి ముఖ్య అతిధులు గా ‘విరాటపర్వం’ మూవీ డైరెక్టర్ వేణు ఉడుగుల, నవీన్ చంద్ర, సాయి పల్లవి, ఆర్ట్ డైరెక్టర్ శ్రీనాగేంద్ర పాల్గొన్నారు. ‘విరాట పర్వం’ మూవీ టీమ్ తో సుమ తెగ సందండి చేసింది. ఈక్రమంలో పవన్ కళ్యాణ్ ఫోటో స్క్రీన్ పై కనిపించగానే.. ఆయన పై తనకున్న అభిప్రాయాలను సాయి పల్లవి తెలిపింది.
ఇదీ చదవండి: విక్రమ్ మూవీ దెబ్బకి బాహుబలి-2 రికార్డు అవుట్!“ఆయన ఎప్పుడూ తనని తాను సూపర్ స్టార్ అని ఫీల్ కాడు. ఆయన ఎక్కడికైనా ఓ సాధారణ వ్యక్తిలానే వెళ్తుంటారు. తన మనస్సుకు ఏది అనిపిస్తదో అది చెప్పేస్తారు. అందుకనే ఆయనంటే నాకు చాలా ఇష్టం” అంటూ పవన్ కళ్యాణ్ పై తనకున్న అభిమానాన్ని సాయిపల్లవి తెలిపింది. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. సాయిపల్లవి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.